Nara Lokesh: విశాఖ ఐటీ అభివృద్ధిని వైసీపీ నాశనం చేసింది..! అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఫైర్! AP Government: ఏపీలో వారికి బదిలీలు, ప్రమోషన్లు! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం షాపుల్లో నగదుతో పనిలేదు..! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Nara Lokesh: విశాఖ ఐటీ అభివృద్ధిని వైసీపీ నాశనం చేసింది..! అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఫైర్! AP Government: ఏపీలో వారికి బదిలీలు, ప్రమోషన్లు! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం షాపుల్లో నగదుతో పనిలేదు..! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..!

Registration: 22ఏ నిషిద్ధ జాబితాకు బ్రేక్‌…! రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్!

 ఆంధ్రప్రదేశ్‌లో రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర ఆరంభంలో కీలకమైన శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్లకు ప్రధాన అడ్డంక

Published : 2026-01-01 17:41:00
GST: జీఎస్టీతో ఖజానాకు భారీ ఊపిరి…! డిసెంబరులో రికార్డు స్థాయి ఆదాయం!

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర ఆరంభంలో కీలకమైన శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్లకు ప్రధాన అడ్డంకిగా మారిన 22ఏ నిషిద్ధ భూముల జాబితాలో భారీ మార్పులు చేసింది. ఈ జాబితా నుంచి ఐదు రకాల భూములను పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం తన శాఖలో తొలి ఫైల్‌పై సంతకం చేశారు. ఈ నిర్ణయంతో సంవత్సరాలుగా భూ లావాదేవీలపై కొనసాగుతున్న అయోమయం, అడ్డంకులకు తెరపడినట్లుగా భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూముల కొనుగోలు–అమ్మకాలపై వచ్చిన ఆంక్షలు తొలగిపోవడం రైతులకు పెద్ద ఊరటగా మారనుంది.

Spirit Movie Update: న్యూ ఇయర్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్!!

మంత్రి ఆదేశాల ప్రకారం, ప్రైవేట్ పట్టా భూములను 22ఏ నిషిద్ధ జాబితా నుంచి సంపూర్ణంగా తొలగించారు. ఈ భూములకు సంబంధించి భూ యజమానులు దరఖాస్తు చేసినా, చేయకపోయినా సంబంధిత అధికారులు సుమోటోగా చర్యలు తీసుకుని జాబితా నుంచి తొలగించాల్సిందిగా ఆదేశించారు. అంతేకాకుండా, సరైన ఆధార పత్రాలు ఉన్న మాజీ, ప్రస్తుత సైనిక ఉద్యోగుల భూములు, స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన భూములను కూడా 22ఏ జాబితా నుంచి మినహాయించాలని నిర్ణయించారు. మిగిలిన కేటగిరీల భూముల విషయంలో త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం (జీవోఎం) సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయాలు భూ యజమానుల నమ్మకాన్ని తిరిగి తీసుకువచ్చే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

Tobacco Products: ఫిబ్రవరి నుంచి పొగాకు వినియోగదారులకు భారీ షాక్.. సిగరెట్లు, బీడీ, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం..!!

ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, భూ యజమానుల హక్కులను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటిని సరిదిద్దే ప్రక్రియను తమ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. ఫ్రీహోల్డ్ భూములపై కూడా రెండు నెలల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ఫిబ్రవరి నుంచి ఈ నిర్ణయాల అమలు ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారు. అలాగే జనవరి 2 నుంచి ఇంటింటికీ వెళ్లి రైతులకు కొత్త భూ పాస్‌బుక్‌లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చర్యలతో భూ రికార్డుల వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Group 2 నియామకాలపై న్యాయ ముసురు తొలగింది…! తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం!

భూ అక్రమాలు, దోపిడీని పూర్తిగా అరికట్టే దిశగా ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు చేపడుతోంది. ఆధార్‌ నంబర్‌ను సర్వే నంబర్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కోసం ప్రత్యేకంగా కొత్త మొబైల్ యాప్‌ను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భూ వివాదాల్లో నిర్లక్ష్యం లేదా అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు, భూ యజమానులకు భారీ ఊరట లభించనుంది. ఇకపై భూ లావాదేవీలు సులభతరం కావడంతో పాటు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా వేగవంతమవుతుందని అంచనా వేస్తున్నారు.

APGovernment: ఎస్సీల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యం.. వడ్డీ లేని రుణాలతో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకం!
సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు!
Web Series: న్యూ ఇయర్ రాత్రి ఓటీటీకి ఊహించని క్రేజ్… ఆ సిరీస్‌కు ఇంత క్రేజ్ ఉందా..!!
రైతులకు శుభవార్త! SBI బ్యాంక్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం! సకాలంలో చెల్లిస్తే కేవలం..
భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే..

Spotlight

Read More →