LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..!

Middle East Conflict: పాకిస్థాన్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. 21 గంటల పాటు సాగిన ఈ చర్చల్లో హోర్ముజ్ జలసంధి, కాల్పుల విరమణపై ఏకాభిప్రాయం కుదరలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ ధృవీకరించారు.

AndhraPravasi News Desk 2 min read
Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..!

Middle East Conflict: మధ్యప్రాచ్యంలో గత ఆరు వారాలుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని పాకిస్థాన్ వేదికగా జరిగిన కీలక చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ ప్రతినిధులతో దాదాపు 21 గంటల పాటు మారథాన్ చర్చలు జరిపినప్పటికీ, ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆదివారం ఉదయం ఇస్లామాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన జేడీ వెన్స్, ఈ వార్తను స్వయంగా ధృవీకరిస్తూ ఇది ఒక "చెడు వార్త" అని అభివర్ణించారు.

అమెరికా తరపున జేడీ వెన్స్‌తో పాటు జేర్డ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ చర్చల్లో పాల్గొనగా, ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ బృందం హాజరయ్యారు. శనివారం రోజున ఇరు దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు కూడా ఈ చర్చల్లో చేరారు. ప్రధానంగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (హోర్ముజ్ జలసంధి) ద్వారా నౌకల రాకపోకలు, కాల్పుల విరమణ పొడిగింపు,  ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను దశలవారీగా ఎత్తివేయడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

అయితే, అమెరికా విధించిన కఠినమైన షరతులకు ఇరాన్ అంగీకరించకపోవడమే ఈ విఫలానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. "మేము దేనికి అంగీకరిస్తామో, దేనికి అంగీకరించబోమో చాలా స్పష్టంగా చెప్పాము. మా 'రెడ్ లైన్స్'  గురించి వారికి ముందే వివరించాము. కానీ వారు మా ప్రతిపాదనలను ఒప్పుకోలేదు," అని వెన్స్ పేర్కొన్నారు. దీనివల్ల గత వారం కుదిరిన రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణకు ఇప్పుడు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది.

ఈ చర్చల్లో ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూపుల మద్దతు, వారి అణు కార్యక్రమాలు  క్షిపణి ప్రయోగాల వంటి కీలక అంశాలపై ఎటువంటి పురోగతి లభించలేదు. మరోవైపు, లెబనాన్‌లో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య జరుగుతున్న పోరాటం కూడా ఈ శాంతి చర్చలపై ప్రతికూల ప్రభావం చూపింది. హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకలు, ముఖ్యంగా చమురు ట్యాంకర్లు స్వేచ్ఛగా తిరగలేకపోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతానికి చర్చలు నిలిచిపోవడంతో అమెరికా ప్రతినిధుల బృందం తిరిగి వాషింగ్టన్‌కు బయలుదేరింది. ఈ వైఫల్యం వల్ల మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకుంటున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా తీసుకోబోయే తదుపరి నిర్ణయాల వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతుందని ఆశించిన అంతర్జాతీయ సమాజానికి ఈ చర్చల విఫలం పెద్ద నిరాశనే మిగిల్చింది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…