LIVE
Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  •  Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!  •  AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 85% సబ్సిడీతో ఆ పథకం పునరుద్ధరణ!  •  TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ఘన విజయం!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!  • 
NRI

TANA: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తానా మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం!

TANA: అమెరికాలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ బృందం ఆధ్వర్యంలో సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది.

AndhraPravasi News Desk 2 min read
TANA: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తానా మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం!

40 మందికిపైగా దాతల భాగస్వామ్యం.. 50 సార్లకు పైగా రక్తదానం చేసిన రంజిత్ కోమటికి ఘన సత్కారం..

తెలుగు సమాజం నుంచి విశేష స్పందన పొందిన తానా రక్తదాన కార్యక్రమం..

అమెరికాలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ బృందం ఆధ్వర్యంలో సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. ప్రాణాలను కాపాడే ఈ మహత్తర సేవా కార్యక్రమానికి తెలుగు సమాజం నుంచి విశేష స్పందన లభించింది.

ఈ రక్తదాన శిబిరాన్ని తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, సమాజానికి మేలు చేసే ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 40 మందికిపైగా రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ బృందాన్ని, ప్రాంతీయ ప్రతినిధి ఫణికంతేటిని, వాలంటీర్లను, రక్తదాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే 50 సార్లకు పైగా రక్తదానం చేసి అరుదైన మైలురాయిని చేరుకున్న రంజిత్ కోమటిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి కూడా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో తానా ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.

మే 31న ఎక్స్‌టాన్‌లో నిర్వహించిన ఈ బ్లడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. తొలిసారిగా రక్తదానం చేసిన వారు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషంగా నిలిచింది. కార్యక్రమానికి వేదికను ఉచితంగా అందించిన వేణు సంగనికి, రక్త సేకరణలో సహకరించిన బ్లడ్ బ్యాంక్ ఆఫ్ డెల్మార్వా బృందానికి తానా నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి స్ప్రూస్ ఇన్ఫోటెక్ గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరించగా, టెస్లా రియాల్టీ గ్రూప్, తనిష్క్ యూఎస్ఏ, చు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓక్స్టన్, స్ప్రింగ్ ఈగిల్స్, రియల్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ వారణాసి సంస్థలు ప్రీమియం స్పాన్సర్లుగా సహకరించాయి.

ఈ సేవా కార్యక్రమంలో సురేష్ యలమంచి, భవాని క్రొత్తపల్లి, శైలజ కస్తూరి, సరోజ పావులూరి, విశ్వనాథ్ కోగంటి, రంజిత్ మామిడి, శ్రీధర్ సాదినేని, శ్రీనివాస్ అబ్బూరి, హరి, గౌరి కర్రోతు, నాగరాజ్, కోటి యాగంటి, శ్రీకాంత్ గుడూరు, ప్రసాద్ కునారపు, రమణ కోత, మధు నల్ల తదితరులు పాల్గొని కార్యక్రమ విజయానికి తమ వంతు సహకారం అందించారు.

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం సేవా భావానికి, సమాజం పట్ల బాధ్యతకు నిదర్శనంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. తెలుగు సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు.

Be the first to react

More Coverage

Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!

Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!

Yogandhra: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిం…