LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Israel Iran War 2026: ముగింపు కాదు.. కేవలం విరామం మాత్రమే.. కాల్పుల విరమణపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు.

Israel Iran War Updates: ఇరాన్‌తో కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన యురేనియం ఆ దేశం నుంచి బయటకు వెళ్లాల్సిందేనని, ఇందుకోసం ఒప్పందానికైనా లేదా యుద్ధానికైనా తాము సిద్ధమని హెచ్చరించారు. ఈ కాల్…

AndhraPravasi News Desk 1 min read
Israel Iran War 2026: ముగింపు కాదు.. కేవలం విరామం మాత్రమే.. కాల్పుల విరమణపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు.

Israel Iran War Updates:  ఇరాన్‌తో కుదిరిన రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెన్యామిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందాన్ని యుద్ధానికి ముగింపుగా భావించవద్దని, ఇది కేవలం గమ్యం వైపు వెళ్లే క్రమంలో ఒక చిన్న 'స్టాప్' మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్నం చేసిన యురేనియం ఆ దేశం దాటి బయటకు వెళ్లాల్సిందేనని, అది చర్చల ద్వారా జరుగుతుందా లేక సైనిక బలంతో సాధించాలా అనేది ఇరాన్ చేతుల్లోనే ఉందని  హెచ్చరించారు.

అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం కీలకమైన 'హార్ముజ్ జలసంధి'ని తిరిగి ఓడల రాకపోకల కోసం తెరిచారు. అయితే, ఇజ్రాయెల్ లక్ష్యాలు మాత్రం ఇంకా పూర్తి కాలేదని నెతన్యాహు గుర్తు చేశారు. "మా ఆపరేషన్ గిడియన్స్ స్వోర్డ్, ఆపరేషన్ లయన్ రోర్ గనుక నిర్వహించి ఉండకపోతే, ఇరాన్ ఇప్పటికే అణు బాంబులతో ఇజ్రాయెల్‌ను నామరూపాలు లేకుండా చేసేది. ఆ దేశ ఉగ్రవాద పాలనను మేము ఎన్నో ఏళ్లు వెనక్కి నెట్టేశాం" అని ఆయన గర్వంగా ప్రకటించారు.

ఇజ్రాయెల్ సైన్యం ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉందని, తమ వేలు ఎప్పుడూ ట్రిగ్గర్‌పైనే ఉంటుందని నెతన్యాహు హెచ్చరించారు. అమెరికా ఒత్తిడి వల్లే ఇజ్రాయెల్ ఈ ఒప్పందానికి ఒప్పుకుందని వస్తున్న విమర్శలను  తోసిపుచ్చారు. డోనాల్డ్ ట్రంప్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇద్దరం ప్రతిరోజూ మాట్లాడుకుంటూనే ఉన్నామని ఆయన వెల్లడించారు.

మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లాపై కూడా దాడులు కొనసాగుతాయని నెతన్యాహు ప్రకటించారు. కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే బీరుట్‌లో దాడులు జరగడం, వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. 

ఇరాన్ తన వద్ద ఉన్న క్షిపణులను ఇప్పటికే కోల్పోయిందని, వారి తయారీ సామర్థ్యాన్ని కూడా దెబ్బతీశామని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఈ యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రానున్న రెండు వారాలు ఇరు దేశాల మధ్య శాంతి కొనసాగుతుందా లేక మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడతాయా అనేది వేచి చూడాలి.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…