LIVE
Fuel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్... త్వరలోనే తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!  •  Prajavedhika: మాజీ మంత్రి బంధువుపై గ్రీవెన్స్‌లో భూ కబ్జా ఫిర్యాదు.... వెబ్‌ల్యాండ్ సాంకేతిక లోపాలతో దొంగ పాస్ పుస్తకాలు.... బాధితులకు మంత్రి నారాయణ భరోసా!  •  APNRT: ప్రవాసాంధ్రులకు సువర్ణావకాశం... విదేశాల్లో కనకదుర్గమ్మ ప్రత్యేక గృహ పూజల సదుపాయం!  •  ఆయుష్మాన్ భారత్ కార్డ్‌తో రూ. 5 లక్షల ఉచిత వైద్యం! పూర్తి వివరాలు...  •  AP Students: విద్యార్థులకు అలర్ట్... ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక ప్రకటన!  •  Chandrababu: జూన్ 10, 11 తేదీల్లో దేశ రాజధానిలోనే బస.. 11వ తేదీ రాత్రికి..  •  తెరపైకి కొత్త డిమాండ్... మాకు ఎస్సీ హోదా కల్పించండి!!  •  AP Government: సామాన్యుడికి ఊరట.. ఏపీలో త్వరలోనే 1,000 మినీ మార్టుల ఏర్పాటు! ఎక్కడక్కడంటే...  •  New Airport: ఏపీలో కొత్తగా ఎయిర్‌పోర్ట్... రూ.648 కోట్లతో నాలుగు జిల్లాలకు పండగే.. 2029నాటికి పూర్తి!  •  Gas Price Hike India: బిగ్ షాక్.. గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించిన కేంద్రం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Mahanadu: మాల్టాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. మహానాడు వేడుకలు!

Mahanadu: మాల్టాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడాయి. MALTA NRI TDP ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమం ప్రవాస తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

AndhraPravasi News Desk 2 min read
Mahanadu: మాల్టాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. మహానాడు వేడుకలు!

మాల్టాలో ఆవిష్కృతమైన అన్న ఎన్టీఆర్ విగ్రహం..

ప్రవాస తెలుగువారితో సందడిగా మాల్టా మహానాడు..

మాల్టాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడాయి. మాల్టా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమం ప్రవాస తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా మాల్టాలో అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో శ్రమించి విగ్రహాన్ని మాల్టాకు తీసుకువచ్చిన విగ్రహ దాత శ్రీమతి ముళ్ళపూడి లతా మురళి గారికి సభ వేదికపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణ సమయంలో పాల్గొన్న అభిమానులు ఎన్టీఆర్ నినాదాలతో కార్యక్రమ ప్రాంగణాన్ని మార్మోగించారు.

విగ్రహ ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన మహానాడులో పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, నందమూరి అభిమానులు, ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాల్టాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను మరువకుండా ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత అని కొనియాడారు. ఆయన రాజకీయాల్లోనూ, సినీరంగంలోనూ సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నా తెలుగు తల్లిపై ప్రేమను నిలబెట్టుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మురళి ముళ్ళపూడి, లతా ముళ్ళపూడి, రవి సాగి, అజార్ షేక్, నరేష్ తాళ్లపనేని, సతీష్ ముళ్ళపూడి, చాగంటి బ్రహ్మ, సుమంత్ పద్మాల, గౌరవ్ జోషి, సురేష్ విశ్వనాథ్, అబ్బూరి ప్రశాంత్, కైపు లక్ష్మి, సంపత్, పి.వేణుగోపాల్, చావా శ్రీనాథ్, కె.రణధీర్, మల్లికార్జున్, వెంకట్ యామిని, రాజీవ్, వికాస్, సతీష్ దుర్గం, వినోద్, ప్రదీప్, సుధీర్ రెడ్డి, వంశీ, గోపీ తదితరులు పాల్గొన్నారు.

మొత్తానికి మాల్టాలో జరిగిన ఈ మహానాడు కార్యక్రమం ప్రవాస తెలుగు ప్రజల్లో ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానాన్ని, తెలుగు సంస్కృతిపై ఉన్న అనుబంధాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

Be the first to react

More Coverage

TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!

TTS: నాష్‌విల్లేలో టీటీఎస్ పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం.. క్రీడాస్ఫూర్తికి తెలుగు సమాజం మద్దతు!

TTS: అమెరికాలోని నాష్‌విల్లే నగరంలో టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెన్స్ డబు…

US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!

US Job Market: అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్.. కానీ భారతీయులకు నో జాబ్స్! సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్!

US Job Market: అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన ఓ మహిళ, తాను నడుపుతున్న ఇండియన్ రెస్టారెంట్‌ల…