LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Indian Aviation Sector: సామాన్యుడికి విమాన ప్రయాణం మరింత దగ్గర.. విమానాల్లో 'పెట్ పాలసీ..కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

Indian Aviation Sector: సీఐఐ స్వర్ణాంధ్ర సదస్సులో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రసంగం. దేశంలో ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభం, రష్యా టెక్నాలజీతో స్వదేశీ విమానాల తయారీ, ఏపీలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వంటి కీలక అంశాలు..

AndhraPravasi News Desk 2 min read
Indian Aviation Sector: సామాన్యుడికి విమాన ప్రయాణం మరింత దగ్గర.. విమానాల్లో 'పెట్ పాలసీ..కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

Vijayawada:  భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన  సుస్థిరమైన దేశంగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన సీఐఐ స్వర్ణాంధ్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్ధిని ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా పౌర విమానయాన రంగంలో భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని, ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించే స్థాయికి మనం చేరుకున్నామని ఆయన సగర్వంగా ప్రకటించారు.

సామాన్యుడికి చేరువైన 'ఉడాన్'.. త్వరలో స్వదేశీ విమానాలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఉడాన్' పథకం ద్వారా విమాన ప్రయాణం కేవలం ధనికులకే పరిమితం కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. విమాన తయారీ రంగంలో కూడా భారత్ అడుగులు వేస్తోందని, రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో త్వరలోనే 100 సీట్ల సామర్థ్యం కలిగిన విమానాలను ఇక్కడే నిర్మిస్తామని వెల్లడించారు. ఈ స్వదేశీ విమానాలు అందుబాటులోకి వస్తే దేశీయంగా విమాన సర్వీసులు మరింత పెరుగుతాయని, ప్రయాణికులపై భార పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.

విమానాల్లో 'పెట్ పాలసీ'.. ప్రయాణికులకు మరిన్ని వెసులుబాట్లు

విమాన ప్రయాణికుల సౌకర్యార్థం మరికొన్ని కొత్త నిబంధనలను తీసుకువస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విమానాల్లో పెంపుడు జంతువులను అనుమతించేలా 'పెట్ పాలసీ'ని అమలు చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే, భద్రతా ప్రమాణాలకు లోబడి సురక్షితమైన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అనుమతించాలని కోరామన్నారు. ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి విజన్.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీఐఐకి అపారమైన నమ్మకం ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. 'విజన్ 2047' లక్ష్య సాధనలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని, అందుకే అనేక కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగనుందని, ఇది రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద ఊపునిస్తుందని చెప్పారు.

రైల్వే జోన్ పనులు.. కేకే లైన్‌పై చర్చలు

విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావిస్తూ.. జోన్ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. సరిహద్దులకు సంబంధించిన అంశాలపై స్పష్టత వచ్చిన వెంటనే రైల్వే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా కేకే (కొత్తవలస-కిరండూల్) లైన్ గురించి కూడా చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…