అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు మంగళవారం యూఎస్ ఎంబసీలకు దౌత్య కేబుల్ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థుల వీసాలకు సైతం నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీపై అమెరికా దృష్టి సారించడంతో వివిధ దేశాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు చాలా మంది యూఎస్ లో తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసే ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉత్తర్వులో పేర్కొన్నారు. అవసరమైన సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు దౌత్య విభాగాలు అదనంగా ఎటువంటి వీసా అపాయింట్ మెంట్లను అనుమతించవని స్పష్టం చేశారు. ఇప్పటికే బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!
వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!
విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!
తీపి కబురు చెప్పిన ఫ్లిప్కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భర్తీ!
కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!
కేటీఆర్కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!
విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: