ఒకే ఇంట్లో 4271 ఓట్లు! యూపీలో ఎన్నికల జాబితాలో సంచలనం!

హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ ఇప్పుడు ఆచరణలోకి రాబోతోంది. ఇంతకాలంగా ప్రయాణికులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైతే, ప్రస్తుతం దాదాపు 19 గంటలు పడుతున్న ప్రయాణం కేవలం రెండు గంటల్లో పూర్తవుతుంది. మొత్తం 626 కి.మీ పొడవైన ఈ హై-స్పీడ్ రైలు లైన్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ఈ ప్రాజెక్ట్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహిస్తోంది.

New Airport: ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బాటలు... 1,098 ఎకరాల భూసేకరణ ప్రారంభం! భూముల ధరలకు రెక్కలు!

ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కి.మీ డిజైన్ స్పీడ్‌తో రూపొందించబడుతుంది. అయితే సాధారణ ఆపరేషనల్ స్పీడ్ గంటకు 320 కి.మీగా నిర్ణయించారు. అంటే ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ తరహాలోనే ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నారు. ఇది ప్రారంభమైతే దక్షిణ భారతదేశంలో రైలు ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఒకప్పుడు రోజంతా కేటాయించాల్సిన ప్రయాణం, ఇప్పుడు కేవలం రెండు గంటల్లో పూర్తి అవ్వడం ప్రయాణికులకు ఊహించని సౌలభ్యాన్ని కలిగిస్తుంది.

Housing Scheme: కేంద్రం వారికి తీపికబురు..! గృహనిర్మాణానికి రూ.1010 కోట్లు.. తొలి విడతలోనే 40 వేల ఇళ్లు!

అయితే ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన సవాల్ భూసేకరణ అని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విస్తృతంగా భూమి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో SCR అధికారులు రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించగా, ఏపీ సీఎం భవిష్యత్తులో దక్షిణ భారత ప్రధాన నగరాలను కలిపే మరో పెద్ద హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌పై ప్రణాళికలను ప్రస్తావించారు.

RAILWAY: ట్రైన్ టికెట్ కావాలంటే ఆధార్ తప్పనిసరి..! టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు..!

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవి ప్రాథమిక ప్రతిపాదనలు మాత్రమే కాగా, సర్వే పూర్తైన తర్వాత తుది డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)లో ఖచ్చితమైన స్టేషన్లను నిర్ణయించనున్నారు. దీని ద్వారా మధ్యలోని ముఖ్య పట్టణాలకు కూడా వేగవంతమైన రవాణా సదుపాయం లభిస్తుంది.

APPSC: నిరుద్యోగ యువతకు బంగారు అవకాశం..! ఏపీపీఎస్సీ ఐదు నోటిఫికేషన్లు జారీ..!

మొత్తం మీద ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తయితే, రెండు నగరాల మధ్య ప్రయాణం వేగంగా, సౌకర్యవంతంగా మారుతుంది. బస్సులు, విమానాలతో పోలిస్తే సమయం, ఖర్చులో ఇది పెద్ద మార్పు తీసుకువస్తుంది. ఈ ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశ ఆర్థిక, వాణిజ్య, సామాజిక రంగాల అభివృద్ధికి కీలకంగా మారనుంది.

కువైట్లో ట్రాఫిక్ నిబంధనలను కఠిన తరం! తెరుసుకున్న స్కూల్ లు! ప్రభుత్వం ఆదేశాలు!
Hereditary Land Regestration: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ భూములు రూ.100 లకే రిజిస్ట్రేషన్! అక్టోబర్ నుండి అమలులోకి...
రోజు చూసే ఈ పూలలో ఇంత విషయం ఉన్నదా! అందానికి అందం లాభానికి లాభం!
AP Jail Department: ఏపీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్! జస్ట్ 5th క్లాస్ పాసైతే చాలు...జైళ్ల శాఖలో ఉద్యోగం పొందొచ్చు!
Anjeer: అధిక బరువు... డయాబెటిస్‌కి సహజమైన మందులా మారిన అత్తిపండ్లు! ఇవి ఏమిటో మీకు తెలుసా!