విదేశాల్లో చదవాలని కోరిక ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి కలగా మారింది. సోషల్ మీడియాలో పుణ్యమా అంటూ వివిధ వీడియోలు వారి యొక్క జీవన విధానం బహుశా ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడం ద్వారానేమో అందరికీ విదేశాల్లో చదువుకోవాలన్న మక్కువ పెరుగుతుంది.
అక్కడి ద్రవ్యం కూడా భారత దేశ విద్యార్థులను బాగా ఆకర్షితులను చేస్తుంది. తక్కువ వ్యవధి లో అధిక మొత్తం సొమ్మును సంపాదించవచ్చు అనే ఆకాంక్ష పెరగడం ద్వారానే విదేశాల ప్రయాణం అధికమయ్యేది. బహుశా ట్రంప్ అనేక ఆంక్షలు పెట్టడం ద్వారానేమో అమెరికాకు వెళ్లాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో తగ్గుతూ వస్తుంది.
అమెరికా యూనివర్సిటీలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాదిలో గణనీయంగా తగ్గింది. జులై, ఆగస్టులో వెళ్ళిన విద్యార్థుల సంఖ్య గతేడాది తో పోలిస్తే సగం దాకా పడిపోయింది. 41,450 మంది మాత్రమే ఈ ఆగస్టులో చేరగా, గతేడాది 74,825 మంది విద్యార్థులు అమెరికాకు వెళ్లారు. కోవిడ్ తర్వాత వీసాల జారీ తగ్గడం, వీసా ఇంటర్వ్యూల వాయిదా, సోషల్ మీడియా ప్రొఫైల్స్పై పరిశీలన వంటి కారణాలు దీనికి ప్రతికూలంగా చేశాయి.
మార్చ్-మే మధ్య కాలంలో అడ్మిషన్లు పొందే విద్యార్థులు వీసా సిద్ధం చేస్తారు కానీ ఈ సమయంలో వీసాల జారీ 27 శాతం తగ్గడం కూడా సమస్యగా మారింది. ఓపీటీ లేకపోవడం వల్ల 54 శాతం మంది విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు వెళ్లకపోవచ్చని అంచనా ఉంది. 2024లో అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 27 శాతం. ఓపీటీ ఎంచుకున్న విద్యార్థుల్లో భారతీయుల వాటా 48 శాతం, చైనీయుల వాటా 20.4 శాతంగా ఉంది.
ఏదేమనప్పటికీ ప్రస్తుత కాలంలో ఏఐ వచ్చిన తర్వాత అధునాధునిక టెక్నాలజీ ద్వారా విద్యార్థులు ఎక్కడైనా విద్యను అభసించే విధంగా రూపకల్పనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే విద్యార్థుల విదేశీయ విద్యను అభ్యసించడంలో వచ్చే ఏడాది శాతం పెరుగుతుందో లేదో అనేది బహుశా కష్టతరం కావచ్చు ఏమో.