Header Banner

చాయ్‌ తియ్యగుంది.. టీడీపీ కార్యకర్త టీ కొట్టులో లోకేశ్‌! తన వెంట నేనున్నానని భరోసా..

  Mon May 26, 2025 21:46        Politics

రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తన కుప్పం-కడప పర్యటనలో ఎదురైన ఒక సంఘటనను పంచుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా శాంతిపురంలో ఒక టీడీపీ కార్యకర్త టీ కొట్టు వద్ద తాను ఆగిన వైనాన్ని ఆయన సోషల్ మీడియాలో వివరించారు. "కుప్పం నుంచి కడపకు రోడ్డుమార్గంలో వెళుతుండగా దారి మధ్యలో శాంతిపురంలోని టీడీపీ కార్యకర్త చెంగాచారి టీకొట్టు వద్ద ఆగాను. టీ తాగి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. మా నూతన గృహప్రవేశం సందర్భంగా చెంగాచారి నన్ను కలిశారు. ఇప్పుడు నేను అకస్మాత్తుగా టీకొట్టు వద్ద ప్రత్యక్షం కావడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో తన టీ అంగడిని మూయించి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని.. తన వెంట నేనున్నానని భరోసా ఇచ్చాను. ఏ అవసరమొచ్చినా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ముందుకు సాగాను" అని లోకేశ్ వెల్లడించారు. ఈ మేరకు ఫొటోలు కూడా పంచుకున్నారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!

        

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..

 

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!

 

వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

 

కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting