Header Banner

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

  Mon May 19, 2025 09:53        Politics

ఈ ఏడాది నవంబర్‌లో నంది నాటకోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. నిన్న అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళాపరిషత్ ఆధ్వర్యంలో ఏలూరులోని శ్రీ మోతే గంగరాజు ప్రాంగణంలోని వైఎంహెచ్‌ఏ హాల్‌లో జరిగిన అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శతజయంతి ఉత్సవాల్లో, జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలో మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళా, సాంస్కృతిక రంగాల వైభవాన్ని, కూటమి ప్రభుత్వం కళలకు, సాంస్కృతిక రంగానికి అందిస్తున్న చేయూతను, పర్యాటక, సినీ రంగ అభివృద్ధి విశేషాలను, పద్య నాటకం గత ఐదేళ్లలో నాటక, కళా రంగాలకు ఇవ్వని పురస్కారాలను తాము అధికారంలోకి రాగానే అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉగాది, కందుకూరి పురస్కారాలు అందించామని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఘనత తెచ్చిన నంది నాటకోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. టీవీ, సినిమా రంగానికి ఇచ్చే నంది అవార్డులను పునరుద్ధరించి నంది నాటకోత్సవాలతో పాటు కలిపి నవంబర్‌లో అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతిభావంతులైన కళాకారుల కోసం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఇవ్వాలని ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి కోరినట్లు ఆయన వెల్లడించారు.

కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుకు అవకాశం ఉందని ఆయన అన్నారు. పీపీపీ విధానంలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో అమరావతిలో సినిమా రంగం ఎదిగేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 


ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #NandiAwards #APCulture #TeluguCinema #TheatreRevival #ArtsAndCulture #AndhraPradesh