TikTok china : అమెరికాలో సోషల్ మీడియా యాప్ ఆపరేట్ చేయబోయే ఒరాకిల్.. టిక్‌టాక్ ఒప్పందంపై త్వరలో!

రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద ఇప్పటివరకు 66,57,508 మంది విద్యార్థులకు సాయం అందించామ‌ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పథకం లబ్ధిదారుల సంఖ్య, నిధుల వినియోగం, నిబంధనల అమలు విధానం వంటి అంశాలపై స్పష్టతనిచ్చారు.

Green Field Highway: ఏపీలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవే! ఇప్పుడు 12 గంటలు కాదు 5 గంటల్లో చేరుకోవచ్చు!

లోకేష్ పేర్కొన్నదాని ప్రకారం, విద్యార్థుల కోసం తగ్గించిన రూ.2వేలు నిధులను పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, పాఠశాల నిర్వహణ, విద్యా వాతావరణ బలోపేతం కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ పథకం కింద విద్యార్థులకు సహాయం అందించడం ద్వారా పాఠశాలల్లో పఠన వాతావరణం మెరుగుపడుతోందని అన్నారు.

TTD News: బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. అవస్థలు పడకుండా.. సులభంగా దర్శనం ఎలా పొందాలంటే!

వైసీపీ సభ్యులు ఈ పథకాన్ని అమ్మఒడి పేరుతో గుర్తిస్తున్నారని, కానీ వాస్తవానికి అది తల్లికి వందనం పథకం అని నారా లోకేష్ స్పష్టం చేశారు. “ఎంతమంది విద్యార్థులు లబ్ధిపొందారో ముందుగా వైసీపీ సభ్యులు తమ గణాంకాలను సరిచూసుకోవాలి. ఒక్కో సభ్యుడు ఒక్కో సంఖ్య చెబుతున్నారు. కానీ మేము అధికారికంగా చెప్పేది 66.57 లక్షల మంది విద్యార్థులకే సాయం అందిందన్నది” అని ఆయన స్పష్టం చేశారు.

GST: ప్రతి ప్యాకేజీపై పూర్తి వివరాలు తప్పనిసరి..! డీలర్లకు వినియోగదారుల శాఖ కీలక ఆదేశాలు..!

ఒకటో తరగతి విద్యార్థులకు ఐడీ మంజూరు చేసిన తర్వాతే తల్లికి వందనం సాయం అందజేస్తామన్న వాగ్దానం అమలులో ఉందని మంత్రి చెప్పారు. అలాగే, ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులు చేరిన తర్వాత పరిశీలన పూర్తిచేసి నిధులు విడుదల చేస్తున్నామన్నారు. ఏమైనా తప్పులు తలెత్తితే వాటిని వెంటనే సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విద్యార్థులు లేదా తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొంటే వాట్సాప్ ద్వారా నేరుగా సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

లిటిల్ హార్ట్స్ బ్యూటీ సంచలనం.. ఆ హీరో అంటే పిచ్చి! అమ్మకు అబద్ధం చెప్పేదాన్ని! ఆయన పేరుతో..

పథకానికి సంబంధించిన నిబంధనల విషయంలో కూడా స్పష్టతనిచ్చిన లోకేష్, “గతంలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలనే మేము కొనసాగిస్తున్నాం. 300 యూనిట్ల విద్యుత్ వినియోగం పరిమితి, ఆప్కాస్ ఉద్యోగుల నిబంధనలు, భూమి పరిమితి వంటి షరతులు అన్నీ వైసీపీ అమలు చేసినవే. వాటిని మేము కొనసాగించాం. అందువల్ల వైసీపీ సభ్యులు దీనిపై తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకూడదు” అన్నారు.

PM Modi Gst Reforms: జీఎస్టీ 2.0 అమలు! ఇక ఇంటింటా పొదుపు పండుగ!

మరింత వివరంగా చెప్పిన మంత్రి, ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే నగదు సాయాన్ని కూడా ఈ పథకంలో జోడించి జమ చేస్తున్నామని తెలిపారు. కొన్నిసార్లు ఈ ప్రక్రియ కొంత సమయం తీసుకోవచ్చని అన్నారు. వైసీపీ హయాంలో నాలుగేళ్లపాటు ఈ పథకాన్ని అమలు చేశారని, కానీ చివరి ఏడాది సాయాన్ని రూ.500 తగ్గించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అర్హులందరికీ ప్రతి సంవత్సరం నిరంతరాయంగా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.

Sudha Murthy: సుధా మూర్తికి మోసపూరిత కాల్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!

అదే విధంగా, డిజిటల్ రేషన్ కార్డులు కూడా మంజూరు చేసి, మరింత పారదర్శకతతో పథకాన్ని అమలు చేస్తున్నామ‌ని లోకేష్ పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పటికే మినహాయింపులు ఇచ్చామని, ఇకపై ఆశావర్కర్లు, అంగన్ వాడీ ఉద్యోగులకు కూడా తల్లికి వందనం వర్తింపుపై కేబినెట్‌లో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Praja Vedika: నేడు (23/9) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

చివరిగా, “అర్హులందరికీ సాయం తప్పక అందుతుంది. ఎవరూ అన్యాయం పాలవ్వరు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు మేమున్నాం. విద్యార్థుల భవిష్యత్తు మా ప్రాధాన్యం” అని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.

SSC భారీ నోటిఫికేషన్ విడుదల..! 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు..!
Gold rate: భారీగా ఎగబాకిన బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాములు ఎంతంటే!
తమలపాకు తింటే ఈ సమస్యలు మాయం.. వాటి ఆరోగ్య రహస్యాలు మీకు తెలుసా? ఒకే ఆకులో రెండు లాభాలు!
GST: జీఎస్టీ-2 రిఫార్మ్స్ అమల్లోకి! 375 వస్తువుల ధరలు తగ్గింపు..! వినియోగదారులకు భారీ ఊరట..!
Railway Tunnel: ఏపీలో ఆ రెండు జిల్లాలకు మహర్దశ! రూ.470 కోట్లతో అతిపెద్ద రైల్వే టన్నెల్! వారికి పండగే పండగ!