LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Travel Tips: ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ జర్నీ ఇక ఈజీ...! పక్కపక్కనే సీట్లు గ్యారెంటీ!

Travel Tips: విమాన ప్రయాణాల్లో ఉన్న అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. ఇకపై ప్రతి విమానంలో 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని, వెబ్ చెక్-ఇన్ పేరుతో అదనపు బాదుడు ఉండకూడదని ఆదేశించింది.

AndhraPravasi News Desk 1 min read
Travel Tips: ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ జర్నీ ఇక ఈజీ...! పక్కపక్కనే సీట్లు గ్యారెంటీ!

పెట్స్ మరియు స్పోర్ట్స్ కిట్లకు ఇక ఫిక్స్‌డ్ ఛార్జీలు…

విమానయాన సంస్థలకు కేంద్రం వార్నింగ్…

ఇక ప్రాంతీయ భాషల్లోనే సమాచారం…

Travel Tips: భారతదేశంలో విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, టికెట్ బుక్ చేసుకునే సమయంలో విమానయాన సంస్థలు వసూలు చేసే వివిధ రకాల అదనపు ఛార్జీలు ప్రయాణికులకు భారంగా మారుతున్నాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్యాసింజర్ ఫస్ట్' (ప్రయాణికుడికే మొదటి ప్రాధాన్యత) విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సీట్ల ఎంపిక, వెబ్ చెక్-ఇన్ మరియు క్యాన్సలేషన్ నిబంధనలలో భారీ మార్పులు చేసింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను విమానయాన సంస్థలు ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగానే అందుబాటులో ఉంచాలి. గతంలో దాదాపు ప్రతి సీటుకు (మిడిల్ సీటుతో సహా) 'సీట్ సెలక్షన్ ఛార్జీ' పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. ఇకపై అటువంటి వెబ్ చెక్-ఇన్ ఉచ్చులో ప్రయాణికులు చిక్కుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది సామాన్య ప్రయాణికుల జేబుకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా చెప్పవచ్చు.

కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి మరో శుభవార్త ఏమిటంటే, ఒకే టికెట్ (PNR)పై బుక్ చేసుకున్న ప్రయాణికులను ఒకే దగ్గర కూర్చోబెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలు లేదా వృద్ధులతో ప్రయాణించేటప్పుడు వారు వేర్వేరు వరుసలలో కూర్చోవడం వల్ల కలిగే ఇబ్బందులను గమనించిన డీజీసీఏ, సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులందరికీ పక్కపక్కనే సీట్లు కేటాయించాలని స్పష్టం చేసింది. దీనికోసం అదనపు డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.

విమానం ఆలస్యమైనా లేదా రద్దయినా ప్రయాణికులకు ఉండే హక్కుల గురించి ఇకపై విమానాశ్రయాల్లో స్పష్టంగా ప్రదర్శించాలి. ముఖ్యంగా తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో డిజిటల్ బోర్డులు, మొబైల్ యాప్‌లలో ఈ సమాచారాన్ని ఉంచడం తప్పనిసరి. విమానం ఆలస్యమైతే భోజనం లేదా రీఫండ్ పొందే హక్కు ప్రయాణికుడికి ఉంటుంది. గతంలో ఈ నిబంధనలు క్లిష్టంగా ఉండేవి, కానీ ఇప్పుడు వాటిని పారదర్శకంగా మార్చారు.
 

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…