Oscar Trump: ఆస్కార్కు భాస్కర్.. నోబెల్‌కు ట్రంప్.. ఇండియాతో సీజ్‌ఫైర్ ట్రంప్ వల్లే పాకిస్థాన్!

హైదరాబాద్‌లో వర్షాల ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ల నుండి వరదనీరు విడుదల కావడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ముఖ్యంగా చాదర్‌ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రహదారులు జలాశయాల్లా మారి ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్లలో చిక్కుకుపోవడంతో ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు చేపడుతోంది. డ్రోన్ల సహాయంతో బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేయడం జరుగుతోంది.

మోదీ చంద్రబాబు కర్నూల్ పర్యటన...ప్రత్యేకత ఏమిటంటే!!

ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ వంటి విభాగాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మునిసిపల్ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ముప్పు కారణంగా పలు విద్యాసంస్థలు, వ్యాపార కేంద్రాలు మూసివేయబడ్డాయి. ఈ క్రమంలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, మూసీ పరివాహక ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

IRCTC : తక్కువ సమయంలో టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇవి తప్పనిసరి.. రైలు టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు!

ఇక మంజీరా నది వరద సంగారెడ్డి, మెదక్ జిల్లాలను వణికిస్తోంది. సింగూరు, మంజీరా బ్యారేజీల నుండి అధిక నీటి విడుదల కారణంగా నది ఉగ్రరూపం దాల్చింది. వరద ధాటికి ఏడుపాయల వనదుర్గా ఆలయం గత కొన్ని రోజులుగా నీట మునిగిపోతోంది. ఆలయంలోని ప్రసాదాల పంపిణీ కేంద్రం వరదలో కొట్టుకుపోయింది. భక్తుల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి ఆలయానికి వెళ్లే మార్గాలను మూసివేశారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Mobile sales: పండుగ సేల్స్‌లో ఫోన్ కొనుగోలు? డిస్కౌంట్ మాత్రమే కాదు, ఇవి తప్పక చూడండి!

మంజీరా పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. రైతులు, పశువుల కాపరులు, మత్స్యకారులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. అధికారులు నది పరివాహక ప్రాంతాల్లో ఎవ్వరూ వెళ్లవద్దని, జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా సూచించారు. వరద తీవ్రత తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Pakistan Prime Minister: భారత్‌ను శత్రు దేశంగా సంబోధించిన పాక్ ప్రధాని.. యూఎన్‌లో భారత ప్రతినిధి పేటల్ గెహ్లోత్ కౌంటర్!
దుబాయ్ కొత్త అకాడమిక్ క్యాలెండర్ విడుదల – చిందులేస్తున్న విద్యార్థులు!!
Trump: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! లీసా మొనాకో తక్షణమే తొలగింపు డిమాండ్..!
CBSE 10 Exams: రెండు సెషన్‌లతో కొత్త విధానం..! Exam 1, Exam 2 పూర్తి షెడ్యూల్..!
Amazon sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్! 4K ప్రొజెక్టర్లపై భారీ డిస్కౌంట్.. ఇంట్లోనే సినిమాటిక్ అనుభవం..!
Cyclone Orange alert: వాయుగుండం ప్రభావం.. నిర్మల్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు 10కిపైగా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ!