యూఏఈ లోని విద్యార్థులకు ఈ సారి శీతాకాలం మరింత ప్రత్యేకంగా మారున్నయని చెప్పుకోవచ్చు. సాధారణంగా మూడు వారాలపాటు మాత్రమే ఉండే శీతాకాల సెలవులను ఈసారి నాలుగు వారాలకి పెంచుతూ దుబాయ్ విద్యా మంత్రిత్వ శాఖ కొత్త అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. దీని ప్రకారం, 2025 డిసెంబర్ 8 నుంచి 2026 జనవరి 4 వరకు పాఠశాలలు మూసివేస్తారు. పాఠశాలలు జనవరి 5 నుంచి తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపారు.
ఈ వార్త వెలువడిన వెంటనే విద్యార్థుల్లో ఆనందానికి అవధులు లేవు అన్నట్టుగా ఉత్సాహంతో ఎగిరి గంతులు వేస్తారని చెప్పుకోవాలి. తల్లిదండ్రులు కూడా కుటుంబంతో కలిసి దీర్ఘకాలిక ప్రయాణాలు ప్లాన్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. అసలే వేడి దేశం ప్రతి ఏట మూడు వారాలు సెలవు మాత్రమే ప్రకటించేవారు, ఈ ఏడాది అదనంగా ఒక వారం రావడంతో విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
అయితే అన్ని పాఠశాలలు ఈ నాలుగు వారాల షెడ్యూల్ను అనుసరించవు. ముఖ్యంగా దుబాయ్లో సీబీఎస్ఈ (CBSE) సిలబస్ను అనుసరించే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పాత పద్ధతినే కొనసాగిస్తూ మూడు వారాల సెలవులు మాత్రమే ఇస్తున్నాయి. మొత్తానికి, ఈసారి శీతాకాల సెలవులు విద్యార్థులకు ఒక లాంగ్ వెకేషన్, తల్లిదండ్రులకు ఫ్యామిలీ టైమ్, ట్రావెల్ రంగానికి గోల్డెన్ ఛాన్స్ గా మారబోతోంది.
ఇన్నాళ్లు వేడిలో ఉక్కిరి బిక్కిరి అయినందుకు ఈ నెల రోజుల శీతాకాల సెలవులు రావడంతో పాఠశాలల్లోనే కాకుండా ట్రావెల్ ఇండస్ట్రీ, టూరిజం రంగాల్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక ట్రావెల్ ఏజెన్సీలు ప్రత్యేక ఆఫర్లను ఆకర్షించేలా ప్రకటిస్తున్నాయి..