PMAY 2.0: పేదల సొంతింటి కల నిజం చేసేందుకు మరో అడుగు..! PMAY 2.0 కింద రూ.405 కోట్లు విడుదల!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ అకడమిక్ డిపాజిటరీ–అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌ (ABC) ప్లాట్‌ఫాంలో విద్యా రికార్డులు అప్‌లోడ్ చేసేందుకు ఇచ్చిన గడువును పొడిగించింది. ఈ గడువు ఇకపై నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. దీని వల్ల విద్యార్థులకు సౌలభ్యం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Preethi Case: సుగాలి ప్రీతి కేసు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, క్రెడిట్ పాయింట్లు భద్రంగా నిల్వ చేసుకోవచ్చు. అవసరమైతే ఒక విద్యాసంస్థ నుంచి మరొకదానికి ఈ రికార్డులను సులభంగా బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థుల విద్యా వివరాలు సురక్షితంగా ఉండటంతో పాటు, భవిష్యత్‌లో అవసరమైనప్పుడు సులభంగా ఉపయోగించుకోవచ్చు.

Cabinet: ఏపీలో ముగ్గురికి కేబినెట్ హోదా..! A, B కేటగిరీల వారీగా ఖరారు!

ఇక విద్యార్థులు, విద్యాసంస్థలలో అవగాహన పెంచేందుకు ఇప్పటికే మూడు వర్క్‌షాప్‌లు నిర్వహించామని విద్యామండలి ఛైర్మన్ మధుమూర్తి తెలిపారు. అలాగే అన్ని యూనివర్శిటీలు, కాలేజీల నోడల్ అధికారులు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్‌కు మరింత భద్రత కలుగుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.

Indian Railways:సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు! అక్టోబర్ 31 వరకు... ఏపీలో హాల్ట్ స్టేషన్లు!
Bank Holiday: ఆర్బీఐ కీలక ప్రకటన! సెప్టెంబర్ 5 న అన్ని బ్యాంకులు సెలవు!
Vehicle Tax: సుప్రీంకోర్టు కీలక తీర్పు! రూ.22.71 లక్షల పన్ను వెనక్కి.. ఆ వాహనాలు ప్రభుత్వానికి పన్ను కట్టక్కర్లేదు!
Trump: ట్రంప్‌కు అమెరికా కోర్టు గట్టి షాక్..! సైన్యం వినియోగం చట్టవిరుద్ధమన్న తీర్పు!
Air Defence: అజేయ గగనతల రక్షణ..! భారత్ మరో ఎస్-400 డీల్‌కి సిద్ధం!
High BP: 46% అమెరికన్లకు హై బీపీ! మరి మన పరిస్థితి ఎలా ఉందో ఊహించగలరా?
Koushalam: నిరుద్యోగులకు శుభవార్త! కౌశలం పోర్టల్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం! ఎలాగంటే?