LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Indian Aviation News: విమాన ఇంధన ధరల పెరుగుదలతో విమానయాన సంస్థల కీలక నిర్ణయం..!!

Air India Ticket Prices: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల ప్రభావం భారత విమానయాన రంగంపై పడనుంది. ఏప్రిల్ 1 నుండి ATF (విమాన ఇంధనం) ధరల పెంపుతో విమాన టికెట్ల ధరలు ఫ్యూయల్ సర్‌ఛార్జ్ పెరిగే అవకాశం ఉంది.

AndhraPravasi News Desk 2 min read
Indian Aviation News: విమాన ఇంధన ధరల పెరుగుదలతో విమానయాన సంస్థల కీలక నిర్ణయం..!!

Air India Ticket Prices: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారతీయ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తుండటంతో, దీని ప్రభావం నేరుగా విమాన ప్రయాణాలపై పడనుంది. ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, దేశీయ విమానయాన సంస్థలు ఏప్రిల్ 1 నుంచి టికెట్ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.

విమాన ఇంధనమే ప్రధాన భారం

సాధారణంగా ఒక విమాన సంస్థ నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 40 శాతం వరకు కేవలం ఇంధనం  కోసమే ఖర్చవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారీ విమానయాన సంస్థలు ఆ భారాన్ని ప్రయాణికులపైకి నెట్టడం పరిపాటిగా మారింది. దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు స్పందిస్తూ.. ప్రతి నెల ఒకటో తేదీన చమురు కంపెనీలు ధరలను సమీక్షిస్తాయని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ ప్రారంభం నుంచి విమాన ప్రయాణం మరింత ప్రియం కావచ్చని సూచనప్రాయంగా తెలిపారు.

ప్రయాణికులపై 'సర్‌ఛార్జ్' వడ్డన

ఇప్పటికే ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి అగ్రశ్రేణి సంస్థలు తమ ఇంధన ఖర్చులను తట్టుకోవడానికి 'ఫ్యూయల్ సర్‌ఛార్జ్' పేరుతో అదనపు బాదుడు మొదలుపెట్టాయి. యుద్ధం గనుక ముదిరితే విమాన మార్గాల్లో మార్పులు చేయాల్సి రావడం, బీమా ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల టికెట్ ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ ముందస్తు చర్యలు

మరోవైపు, ఈ పెరిగిన ధరల వల్ల సామాన్య ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ  పెట్రోలియం శాఖలతో కలిసి పౌర విమానయాన శాఖ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. విమాన సంస్థలతో చర్చలు జరిపి, ధరలు అదుపు తప్పకుండా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, అంతర్జాతీయ సంక్షోభం త్వరగా సర్దుకోకపోతే ఏప్రిల్ నుంచి విమాన ప్రయాణం ఒక విలాసంగా మారే ప్రమాదం ఉంది. వేసవి సెలవుల్లో ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వారు, ధరలు మరింత పెరగకముందే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…