సాయిసాధన చిట్ఫండ్ బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ సమస్యలను వివరించారు. చంద్రబాబు నివాసానికి వచ్చిన బాధితులను చూసిన సీఎం తన కాన్వాయ్ను ఆపి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రూ.250 కోట్లకుపైగా మోసపోయినట్లు బాధితులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఈ కుంభకోణం కారణంగా 600 కుటుంబాలు రోడ్డున పడిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 40 రోజుల క్రితమే చిట్ఫండ్ యజమాని కోర్టులో లొంగిపోయినా, ఇంకా న్యాయం జరగలేదని బాధితులు సీఎం వద్ద మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా 10 నిమిషాలపాటు బాధితుల సమస్యలను విన్న చంద్రబాబు, ప్రజలను మోసం చేసినవారు కోర్టులో లొంగిపోవడం సరిపోదని, బాధితులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులను ఆదుకునే దిశగా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తాడేపల్లిలో అరుదైన నాలుగు కాళ్ల జీవి కలకలం! భయంతో పరుగులు తీసిన స్థానికులు!
పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!
టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం! రఘురామ కేసులో కీలక మలుపు! సీఐడీ మాజీ చీఫ్ పై సస్పెన్షన్ వేటు!
పోసాని కేసులో కొత్త మలుపు! అరెస్టు భయంతో హైకోర్టు మెట్లెక్కిన సజ్జల రామకృష్ణారెడ్డి, కుమారుడు!
శ్రీశైలం ఆలయంలో నకిలీ టికెట్ల గుట్టురట్టు! భక్తులకు మరో హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ! ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా ఆ హీరోయిన్..
రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: