తెలుగు పల్లెల్లో తరతరాలుగా కొనసాగుతున్న జానపద కళల్లో దొమ్మరి ఆటఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. దొమ్మర కుటుంబాలు ఈ కళ ద్వారా జీవన ఆధారం అదేవిధంగా వారి యొక్క సంప్రదాయం కూడా చెప్పుకోవచ్చు. నేటి కాలంలో ఇది తక్కువ కానీ మన అమ్మమ్మల కాలంలో ఈ ఆట వస్తుంటే చాలు ఊర్లో ప్రజలంతా ఒక్కచోట చేరి ఈ ఆటను చూస్తూ కేరింతలు చేసేవారు. తాడుపై నడవడం, గడపై విన్యాసాలు చేయడం డోలు వాయించడం, మాటలు పలకడం వంటి ప్రదర్శనలు ఈ ఆటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ వారంతా కలసి ఈ కళలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో బీసీ సంక్షేమశాఖ జారీ చేసిన జీవో నంబర్ 5లో దొమ్మర సామాజిక వర్గాన్ని దొమ్మర (గిరి బలిజ)మార్చారు.
అయితే బుధవారం కొత్త ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ జీవో రద్దు చేసి దొమ్మర వర్గాన్ని మునుపటిలాగే దొమ్మర గానే పరిగణించాలని స్పష్టత ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది.
దొమ్మరి ఆటకు సాహిత్యంలోనూ ప్రాముఖ్యత ఉంది. పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్ర లో దొమ్మరి స్త్రీని ఆకాశంలో ఆడే దేవత తో పోల్చారు. శ్రీనాథుడు తన పల్నాటి వీరచరిత్ర లో అయ్యలరాజు రామభద్రుడు తన రామాభ్యుదయం లో ఈ కళను ప్రస్తావించారు. కాబట్టి ఈ కళ కేవలం వినోదం మాత్రమే కాకుండా సాహిత్యంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ కళను కాపాడటం అంటే ఒక సమాజం ఒక వర్గం ఒక గుర్తింపును రక్షించడం. పూర్వం సాహిత్యంలో పొందిన ప్రాధాన్యత పల్లెలో ప్రజలకు ఇచ్చిన వినోదం, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలతో మళ్లీ బలపడింది. ఈ కళ ఈ వర్గం ఈ గుర్తింపు భవిష్యత్తులో కూడా శాశ్వతంగా నిలిచే ప్రభుత్వం కూడా త్వరలో చర్యలు తీసుకోనుంది.