భారతీయ రైల్వే చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం ముగిసింది. ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ సురేఖా యాదవ్ 36 ఏళ్ల దీర్ఘ సేవ అనంతరం రిటైర్మెంట్ తీసుకున్నారు. 1988లో మహారాష్ట్రకు చెందిన ఈమె రైల్వేలో సహాయక డ్రైవర్గా తన కెరీర్ ప్రారంభించి తర్వాతే ప్రయాణికుల రైళ్లకు పైలట్గా మారి చరిత్ర సృష్టించారు.
తన కఠోర శ్రమ నిబద్ధతతో పురుషాధిక్య వృత్తిలో స్త్రీలకు కూడా స్థానం కల్పించవచ్చని నిరూపించారు. ఆరంభ రోజుల్లో అనేక విమర్శలు అనుమానాలు ఎదురైనా వాటిని అడ్డుకట్టలుగా కాక సవాళ్లుగా స్వీకరించి ఒక్కో మెట్టుగా విజయాన్ని సాధించారు.
సురేఖా యాదవ్ 2000లలో దక్షిణ మధ్య రైల్వే, సెంట్రల్ రైల్వే పరిధిలో అనేక ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపారు ముంబై-పుణే మార్గంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు 2011లో ఆమెకు ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అవార్డు కూడా లభించింది.
రిటైర్మెంట్ సందర్భంగా సురేఖా మాట్లాడుతూ లోకో పైలట్గా నాకొచ్చిన అవకాశమే నా జీవిత గర్వకారణం. రైల్వేలో చేరదలచిన యువతులు భయపడకుండా ముందుకు రావాలి. రైళ్లు నడపడం ఒక పని మాత్రమే కాదు అది ఒక సేవ అని భావోద్వేగంగా చెప్పారు.
సురేఖా యాదవ్ రిటైర్మెంట్తో ఒక అధ్యాయం ముగిసినా ఆమె వేసిన బాటలో అనేక మంది మహిళా పైలట్లు ముందుకు రావడం ప్రారంభించారు. ఆమె కృషి భవిష్యత్ తరాలకి ప్రేరణగా నిలిచేంతటి గొప్ప వారసత్వం రావాలని కోరుకుందాం.