Aqua Farmers: AP ఆక్వా రైతులకు కీలక హెచ్చరిక..! వారికి ఒక్క రూపాయి రాయితీ కూడా లభించదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో పని గంటలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు–2025 మరియు ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు–2025లకు శాసనసభ ఆమోదం తెలిపింది. కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. కొత్త చట్టం ప్రకారం, ప్రస్తుతం షాపుల్లో రోజుకు ఎనిమిది గంటలపాటు పని చేసే సమయాన్ని పది గంటలకు పెంచనున్నారు. అయితే వారానికి 48 గంటల పరిమితి మాత్రం యథాతథంగా కొనసాగనుంది. ఫ్యాక్టరీల్లో ఇప్పటి వరకు తొమ్మిది గంటల పని సమయం ఉండగా, అది కూడా పది గంటలకు పెంచబడింది.

Amaravati Updates: అమరావతికి పెరిగిన క్రేజ్.. కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు.. ప్రజల ఆశ! ప్రాపర్టీ షోలో సందడి!

పని గంటలు పెరగడం వల్ల కార్మికులపై అదనపు ఒత్తిడి పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం విశ్రాంతి సమయాలపై కూడా నిబంధనలు రూపొందించింది. ఒక కార్మికుడు రోజులో 12 గంటలకు మించి (పని + విశ్రాంతి) ఉండకూడదు. ప్రతి 6 గంటలకు కనీసం అరగంట విరామం తప్పనిసరిగా ఇవ్వాలని బిల్లులో స్పష్టతనిచ్చారు. అంతేకాకుండా, ఓవర్ టైమ్ పరిమితిని కూడా భారీగా పెంచారు. ఇంతకు ముందు మూడు నెలలకు 75 గంటలు మాత్రమే ఓవర్ టైమ్ అనుమతి ఉండగా, ఇప్పుడు దానిని 144 గంటలకు పెంచారు. దీంతో కార్మికులు అదనపు పారితోషికం పొందే అవకాశం పెరిగినట్లే, సంస్థలకు కూడా ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తున్నారు.

EC: ఏపీలో ఆ పార్టీలకు ఈసీ షాక్..! రెండు నెలల్లోనే 808 పార్టీలు రద్దు..!

కొత్త చట్టం మహిళా ఉద్యోగుల హక్కులు, భద్రతను దృష్టిలో పెట్టుకుని కూడా మార్పులు చేసింది. ఇప్పటివరకు మహిళలు రాత్రి 7 గంటల వరకు ఫ్యాక్టరీల్లో, రాత్రి 8.30 వరకు దుకాణాల్లో పనిచేసే అవకాశం ఉండేది. ఇకపై ఈ సమయాన్ని విస్తరించి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా పని చేయడానికి అనుమతి ఇవ్వబడింది. అయితే, దీనికి మహిళల స్వచ్ఛంద అనుమతి తప్పనిసరి. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే మహిళలకు రవాణా, భద్రతా సౌకర్యాలు కల్పించడం సంస్థలే భాధ్యతగా తీసుకోవాలని చట్టం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల మహిళలకు ఉద్యోగావకాశాలు విస్తరించడంతో పాటు, రాత్రి షిఫ్ట్‌లలో పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు కూడా లభించనున్నాయి.

AP’s rich biodiversity: ఏపీ సముద్రాల్లో అద్భుతం.. పరిశోధకులకు కొత్త ఆశలు రేకెత్తించిన అరుదైన డాల్ఫిన్‌ల గుంపు.. ఇకపై తరచూ.!

చిన్న వ్యాపారాలు, 20 మందికి తక్కువ సిబ్బంది ఉన్న సంస్థలకు కొంత మినహాయింపు ఇచ్చినప్పటికీ, వారు కూడా కొన్ని ముఖ్యమైన రూల్స్ పాటించాల్సిందే. ఈ నిర్ణయాలు కార్మికులపై అదనపు భారమా, లేక వృత్తి అవకాశాల విస్తరణకా అన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది. ప్రభుత్వం మాత్రం కార్మికులు, సంస్థలు రెండింటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమతుల్య నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. ఒకవైపు ఉత్పాదకత పెరగడం, మరోవైపు కార్మికులకు న్యాయమైన విశ్రాంతి, భద్రత లభించడం ఈ సవరణల ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంటోంది.

Lemon Tips: నిమ్మకాయ ఎంత మంచిదైనా.. ఈ ఆహారాలతో కలిపి తింటే నేరుగా కైలాసానికే! ఎందుకంటే.!
AP Beach Festival: ఏపీ టూరిజం కొత్త ప్లాన్.. బీచ్ ఫెస్టివల్‌కు అదిరిపోయే ఏర్పాట్లు! మూడు రోజులు తగ్గేదేలే!
Workers : కార్మికులు vs పరిశ్రమలు.. పని గంటల పెంపుపై వాదనలు!
electricity surcharge: AP విద్యుత్ వినియోగదారులకు ఊరట..! విద్యుత్ సుంకాల రీఫండ్‌ విషయంలో సుప్రీంకోర్టు స్టే..!
Diwali Sale 2025: ఈ దీపావళికి షావోమీ బంపర్ ఆఫర్లు.. కళ్లు చెదిరే తగ్గింపులు! మోడల్, ధరల వివరాలు..
Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో వైఎస్ ఫ్యామిలీ..! చెన్నై నుంచి గల్ఫ్ వరకూ కార్పొరేట్ బాగోతం!