Diwali Sale 2025: ఈ దీపావళికి షావోమీ బంపర్ ఆఫర్లు.. కళ్లు చెదిరే తగ్గింపులు! మోడల్, ధరల వివరాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుండి ఊరట లభించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 2022 ఏప్రిల్ 8న ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 7 ద్వారా విద్యుత్ వినియోగదారుల నుండి వసూలు చేసే సుంకాన్ని యూనిట్‌కి 6 పైసల నుంచి రూ.1కి పెంచింది. దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు అయి, హైకోర్టు ఆ జీవోను రద్దు చేసి వినియోగదారులకు రూ.6,292 కోట్లు రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఈ కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సుప్రీం కోర్టు జస్టిస్ పి.ఎస్. నరసింహ మరియు జస్టిస్ ఎ.ఎస్. చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనంపై విచారణ జరిపింది. కోర్టు ఈ కేసు రాజ్యాంగపరమైన అంశం కాబట్టి పూర్తిగా వాదనలు వింటుందని తెలిపింది. హైకోర్టు తీర్పులోని రీఫండ్ అంశంపై స్టే విధించడంతో, ప్రస్తుతం పెంచిన సుంకాలను వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్టు తదుపరి విచారణను 2026 ఫిబ్రవరి వరకు వాయిదా వేశాయి.

విద్యుత్ సుంకాల చరిత్రను పరిశీలిస్తే, 1939లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ చట్టం ప్రకారం యూనిట్‌కి 4 పైసలు వసూలు చేసేవారు. 1994లో ఈ సుంకాన్ని 6 పైసలకు పెంచారు. ఆ తర్వాత డిస్కంలు అధిక భారం మోయలేమని, వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి కోరాయి. ప్రభుత్వం 1994లో జీవో నంబరు 277 ద్వారా అనుమతి ఇచ్చింది. 2021 ఆగస్టు 26న సవరణ చేసి, వేర్వేరు వినియోగదారులకు వేర్వేరు రేట్లు విధించే అవకాశాన్ని కల్పించింది.

తదుపరి 2022 ఏప్రిల్ 8న కేంద్రం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 7 ప్రకారం, గృహ, వ్యవసాయ వినియోగదారులను వదిలి, వాణిజ్య మరియు పరిశ్రమల వినియోగదారులపై యూనిట్‌కి 6 పైసల నుంచి రూ.1కి పెంచారు. దీని ద్వారా డిస్కంలు వినియోగదారుల నుంచి రూ.6,292.18 కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాయి. ఆ తర్వాత హైకోర్టులో ఈ జీయోను సవాల్ చేసి రద్దు చేయించగా, సుప్రీంకోర్టు ఇప్పుడు హైకోర్టు తీర్పులోని రీఫండ్ అంశంపై స్టే విధిస్తూ ప్రభుత్వానికి ఊరట కల్పించింది.

Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో వైఎస్ ఫ్యామిలీ..! చెన్నై నుంచి గల్ఫ్ వరకూ కార్పొరేట్ బాగోతం!
Kitchen Tips: ఫ్రిజ్‌లో ఈ కూరగాయలు పెడుతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే, జాగ్రత్త.!
OTT New Movie: థియేటర్లలో నవ్వుల జల్లు.. ఇలా చేస్తే మీ ఫోన్ మీద ఒట్టే! ఓటీటీ డేట్‌పై గందరగోళం..
Clover Leaf: ఏపీలోనే అతిపెద్ద క్రాస్‌ క్లోవర్‌ లీఫ్‌! 127 ఎకరాల్లో రూ.600 కోట్లతో... భూసేకరణకు రెడీ!
New Cars: కారు కొనడానికి ఇదే బెస్ట్ టైమ్.. రూ. 7 లక్షల బడ్జెట్‌లో టాప్ 5 కార్లు.! తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు!
Suryalanka Beach: సూర్యలంక బీచ్‌లో రంగుల హరివిల్లు.. యువత క్రీయాశీలత ప్రధాన ఆకర్షణ!
Onion Farmers: ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వ బంపర్ ఆఫర్..! రైతుల ఖాతాల్లోకే నేరుగా రూ.50 వేలు..!
CM Macherala: నేడు మాచర్లలో పర్యటించనున్న సీఎం.. ప్రజా సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలపై!
H1B Visas: అమెరికాలో H1B వీసాలపై భారతీయుల ఆధిపత్యం.. 12.5% తో రెండో స్థానంలో చైనీయులు!