వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనికి ఉచ్చు బిగుస్తోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి రూ. 2.20 కోట్లను వసూలు చేశారన్న అభియోగాలతో ఆమెపై కేసు నమోదుకు రంగం సిద్ధమయింది. విడదల రజనిని విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఏసీబీ లేఖ రాసింది. గవర్నర్ అనుమతి ఇచ్చిన వెంటనే ఆమెపై కేసు నమోదు చేస్తారు. మరోవైపు ఇదే కేసులో ఐపీఎస్ అధికారి జాషువాను విచారించేందుకు చీఫ్ సెక్రటరీ నుంచి ఏసీబీ అధికారులు అనుమతిని తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్బై.. జనసేనలోకి..!
విడదల అక్రమ వసూళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని... చివరకు రూ. 2.20 కోట్లు వసూలు చేశారని నివేదికలో పేర్కొంది. ఇందులో రజనికి రూ. 2 కోట్లు, జాషువాకు రూ. 10 లక్షలు, రజని పీఏకు రూ. 10 లక్షలు చెల్లించారని తెలిపింది. దీని ఆధారంగా ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో కేసు నమోదుకు కావాల్సిన అనుమతులను ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?
తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!
ఏపీలో ఉచిత విద్యుత్పై మంత్రి కీలక ప్రకటన! ఇకపై అలా జరగకుండా..
బెజవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..
దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!
విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..
కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: