ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక. ఈ నెల (మార్చి) 31లోపు కచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సర్కులర్ జారీ చేశారు. 'కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈకేవైసీ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సి ఉంది. తహసీల్దార్లు,రేషన్ డీలర్లు, డీఎస్వోలు, కలెక్టర్ల (సివిల్ సప్లయిస్) లాగిన్లలో ఈకేవైసీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ-పోస్ పరికరాల ద్వారా ఈకేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది. ఐదేళ్లలోపు పిల్లలు మినహా మిగిలిన లబ్ధిదారులందరి ఈకేవైసీపీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. లేకపోతే రేషన్కార్డుదారులకు భవిషత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది’ అన్నారు. ప్రతి రేషన్ కార్డులోని సభ్యులందరి ఈ-కేవైసీ చేయించాల్సిందే.. ఈ నెలఖారులోపు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిందే.
ఇది కూడా చదవండి: ఆంధ్రప్రదేశ్లో క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. అల ఆకాశంలో.. జాలీ జాలీగా ప్రయాణం.!
నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం అందించే రేషన్ సరకులతో పాటు మిగిలిన సంక్షేమ పథకాలూ అందవు అంటున్నారు. 'రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ-కేవైసీ పూర్తి కాని వారి సమాచారం సంబంధిత పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు (సీఎస్డీటీలు), డీలర్ల దగ్గర అందుబాటులో ఉంది.. కార్డుదారులు వారిని సంప్రదిస్తే వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రక్రియ పూర్తి చేస్తారు' అని అధికారులు తెలిపారు. 'రేషన్కార్డుదారులు ఈ-కేవైసీ ప్రక్రియను ఎక్కడి నుంచైనా చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. రేషన్ డీలర్, వీఆర్వో, తహసీల్దార్ లాగిన్లలో ఈకేవైసీ చేయించేందుకు అవకాశం ఉంది. డీలర్ వద్దకు వెళ్లి కార్డు సంఖ్య చెబితే చాలు... ఈ-పోస్ యంత్రంలో వివరాలు పొందుపరిచి.. కార్డులోని సభ్యులకు ఈ-కేవైసీ పూర్తయిందా...లేదా అనేది చెబుతారు. ఏ సభ్యుడికి పూర్తి కాలేదో వారి ఆధార్ వివరాలు నమోదు చేసి వేలిముద్ర వేసి అప్డేట్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది' అంటున్నారు అధికారులు. రేషన్ దుకాణాల్లో, సచివాలయాల దగ్గర వీఆర్వోల ద్వారా కూడా పూర్తి చేయించుకోవచ్చు. కాబట్టి రేషన్కార్డులు ఉన్నవారు వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. బియ్యం కార్డులో పేరు ఉన్న ఆరు నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న సభ్యులంతా ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలంటున్నారు.
ఇది కూడా చదవండి: కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన.. కచ్చితంగా అలా చేయాల్సిందే.!
ఏపీలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ఓకే చెప్పిన జైషా.. అక్కడే ఫిక్స్.!
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉద్రిక్త వాతావరణం.. కారణమిదే!
దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి! ఆసిఫ్ మృతికి గల కారణాలు.!
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం! తరిగొండ వెంగమాంబ సత్రంలో..
రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!
చీప్.. వెరీ చీప్.. రూ. 599కే ఎయిర్ ఇండియా టికెట్.! ఈ బంపర్ ఆఫర్ మిస్సవ్వకండి.!
జగన్ పరిస్థితి అయోమయం.. సీఐడీ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే.. ఆదేశాలు జారీ చేసిన కోర్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: