ఇటీవల కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) అనేది సినీ ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. సినిమాల్లో కేవలం విశేష దృశ్య ప్రభావాల (స్పెషల్ ఎఫెక్ట్స్) కోసం వాడిన ఈ సాంకేతికత, ఇప్పుడు డిజిటల్ మోసగాళ్ల చేతిలో అస్త్రం అయింది. ఏఐ సాయంతో ప్రముఖుల రూపంలో చిత్రాలు, వీడియోలు తయారవుతున్నాయి. వాటిని అనుచిత ప్రకటనల అశ్లీల కంటెంట్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ వీడియోస్ లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు హీరోలు హీరోయిన్ సైతం ఫొటోస్ ను ఏఐ ద్వారా జెనరేట్ చేసి ఆ వీడియోలను ఆ ఫోటోలను తమ ఫేక్ అకౌంట్ లో పోస్ట్ చేసి ఫాలోవర్స్ కోసం మరి దారుణంగా చేస్తున్నారు సోషల్ మీడియా నేరగాళ్లు. సినిమా లో సినీతారలు విలన్లను సులభంగా ఓడిస్తారు కానీ ఈ ఏఐ విలన్ వారిని ఇబ్బంది పడుతున్న విషయం నేటి కాలంలోనే చూస్తున్నాం . యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి వేదికల్లో ఇలాంటి నకిలీ చిత్రాలు, వీడియోలు అప్లోడ్ అవుతున్నాయని బాధితులు కోర్టు శరణు చేరుతున్నారు.
దీనికి సంబంధించి నటుడు అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగించి బెట్టింగ్ యాప్స్, డార్క్ వెబ్సైట్లు మరియు కొన్ని సినిమా సైట్లలో అశ్లీల కంటెంట్ రూపంలో ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ కేసు సైతం 10 ఛానల్ కు సంబంధించి వేసిన నాగార్జునకు సంబంధించిన సమాచారాన్ని డిలీట్ చేయాల్సిందిగా ఆదేశించిన విషయం కూడా తెలిసినదే.
రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ శాఖ అధికారులు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. కేవలం ఫిర్యాదు వచ్చినపుడు మాత్రమే మేము చర్యలు తీసుకోగలము. ముందుగానే అడ్డుకోవడం కష్టం అని అన్నారు. ఈ ఏఐ సమస్య సినీ నటులకే పరిమితం కాదు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మొత్తానికి – కృత్రిమ మేధ శక్తి (ఏఐ శక్తి) సృష్టికి, వినోదానికి ఉపయోగపడటమే కాకుండా, అపవాద, అపకీర్తి, మోసం వంటి దుష్ప్రయోజనాలకు కూడా వాడబడుతోంది. అవసరమైతే తప్ప మీ ఫొటోస్ ను త్వరగా సోషల్ మీడియా వెబ్సైట్లో పోస్ట్ చేసుకోకుండా ఉండటం ఉత్తమం.