ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.. రాష్ట్రంలోని పట్టణ ప్రజల కోసం డీజీ లక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. డీజీ లక్ష్మి ద్వారా ప్రజలకు 250 రకాల సేవలు అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,034 కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ-సాధారణ సేవా కేంద్రాలు) ఏర్పాటు చేస్తారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు (డ్వాక్రా మహిళలు) ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. ఈ మేరకు ఈ సీఎస్‌సీ సెంట్లర్ల నిర్వహణ కోసం అర్హులైన సభ్యులను ఎంపిక చేసేందుకు మెప్మాకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ సీఎస్‌సీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ-సేవా కేంద్రాల తరహాలోనే ఈ సెంటర్లలో వివిధ రకాల సేవల్ని ప్రజలు పొందవచ్చు. ఈ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించడంతో పాటుగా మహిళలకు ఉపాధి కూడా లభిస్తుందని భావిస్తోంది ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: NH Green signal:ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే! రూ.2,500 కోట్లతో ..ఈ రూట్‌లోనే 1 గంటలో తిరుపతి!

ఈ పథకానికి ఎంపిక కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. 'స్వయం సహాయక సంఘంలో కనీసం మూడేళ్ల క్రితం చేరి ఉండాలి. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వివాహం అయి ఉండాలి.. సంబంధిత స్లమ్ లెవెల్ ఫెడరేషన్ పరిధిలో నివాసి అయి ఉండాలి. డిగ్రీ చదివి ఉండాలి.. స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఎంపికైన సభ్యులకు సెంటర్ ఏర్పాటు చేయడానికి రూ.2.50 లక్షల వరకు రుణం (కియోస్క్, ఇతర సదుపాయాల కల్పనకు) ఇస్తారు. ఏపీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని చూస్తుంది. మహిళలకు ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

ఇది కూడా చదవండి:  New Rules: జూలై 1 నుంచి మారనున్న కొత్త రూల్స్! పాన్ కార్డు, ఆధార్, గ్యాస్ నుంచి టికెట్ ధరల వరకు! తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!


ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రభుత్వం రూ.23.84 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వీరితో పాటుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుంది. స్వచ్ఛ భారత్‌ అర్బన్‌ 2.0 కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ ఉంటుంది. 123 మున్సిపల్, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో శిక్షణ ఇస్తారు. ఈ మేరకు ఈ శిక్షణ ఇచ్చేందుకు ఏఐఐఎల్‌ఎస్‌జీ, సాహాస్, వాష్ సంస్థలను ఎంపిక చేస్తారు. స్వచ్ఛాంధ్ర సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Ohio plane crash: అమెరికాలో దారుణం.. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిన విమానం!

కుప్పం నియోజకవర్గంలోని 51 చెరువులను బాగు చేస్తారు. దీని కోసం స్వర్ణకుప్పం-2029 మార్గసూచి కార్యక్రమంలో భాగంగా రూ.14.41 కోట్లు మంజూరు చేశారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటు రాజమహేంద్రవరం దగ్గర గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించనున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది. జాతీయ నదుల సంరక్షణలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

 National Highways: ఆ జాతీయ రహదారులకు మారనున్న రూపు రేఖలు! 988 కిలో మీటర్ల మేర విస్తరణ!

 WhatsApp Governance: ఏపీలో ఇకపై వాట్సప్ నుండే పన్నుల చెల్లింపు! ఆ అక్రమాలకు చెక్!

Tirupati Trains: కర్ణాటక నుంచి తిరుపతికి వీక్లీ ఎక్స్ ప్రెస్! ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే!

E-Passport: చిప్‌తో కొత్త పాస్‌పోర్టులు! ఏమిటీ ఈ-పాస్‌పోర్ట్? ఎలా పనిచేస్తుంది?

Hyderabad To Vizag: హైదరాబాద్-విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్! 2 గంటలు తగ్గబోతున్న దూరం?

Gold Pricedrop: తొందరపడి బంగారం ఇప్పుడే కొనకండి.. ధరలు ఇంకా భారీగా తగ్గబోతున్నాయి! కారణం ఏంటంటే?

Tata Nano EV 2025 : టాటా నానో ఎలక్ట్రిక్ కారు వస్తోందోచ్.. లాంచ్ డేట్ ఇదేనట! ఫుల్ ఛార్జ్‌ చేస్తే 260 కి.మీ రేంజ్!

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. ఈ ప్రాంతాలకు ఉరుములతో వర్షాలు!

Lokesh wishes: ప్రసాద్‌ను అభినందించిన లోకేశ్! విశాఖ జిల్లా మత్స్యకార గ్రామానికి..

Super Plan: ఏపీ ప్రభుత్వం సూపర్ ప్లాన్! ఆ 8 ప్రాంతాలకు మహర్దశ!

First Digital Highway: దేశంలో తొలి ఏఐ డిజిటల్ హైవే! ఎక్కడో తెలుసా?

AP Government: మరో పథకానికి డేట్ ఫిక్స్! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group