ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు శక్తివంచన లేకుండా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునేలా అన్ని పార్టీలు ఆకర్షణీయమైన హామీలను గుప్పిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటికే బీజేపీ రెండు మేనిఫెస్టోలను విడుదల చేసింది. తాజాగా మూడో మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. సంకల్ప్ పత్ర-3 పేరుతో మూడో మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఆగిపోవని చెప్పారు. అన్ని హామీలను బీజేపీ నెరవేరుస్తుందని తెలిపారు.
ఇంకా చదవండి: విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
అమిత్ షా విడుదల చేసిన మేనిఫెస్టోలో 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ విజన్, కీలక వాగ్దానాలను పొందుపరిచారు. మేనిఫెస్టో అంటే విశ్వతనీయత అని, తాము ఇచ్చినవి ఫేక్ వాగ్దానాలు కావని అమిత్ షా అన్నారు. 1.08 లక్షల మంది ప్రజలు, 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు తీసుకుని ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారు. ఢిల్లీ ప్రజలను ఆప్ మభ్యపెట్టే ప్రయత్నంచేస్తోందని అమిత్ షా విమర్శించారు. జల్ బోర్డ్ స్కామ్, డీటీసీ స్కామ్, సీసీటీవీ స్కామ్, మెడికల్ టెస్ట్ స్కామ్, ఎక్సైజ్ స్కామ్ వంటి కుంభకోణాల్లో ఆప్ చిక్కుకుందని అన్నారు. ఢిల్లీకి ఉజ్వల భవిష్యత్తును ఇచ్చే బీజేపీని ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.
ఇంకా చదవండి: షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..
ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..
మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: