LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Clay Pots: మట్టి కుండలతో చల్లని ఇళ్లు… విద్యుత్ ఖర్చు తగ్గించే తెలివైన పద్ధతి!

Clay Pot Cooling: ఎండాకాలం ముదురుతున్న కొద్దీ మధ్యాహ్నానికి ఇళ్లలో ఉండటం చాలా కష్టంగా మారుతోంది. ఇంటి పైకప్పు వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది, ఫ్యాన్లు ఫుల్ స్పీడ్‌లో తిరిగినా గాలి గట్టిగా, భారంగా అనిపిస్తోంది. ఈ సమస్యకు సమాధానం మన ఇళ్ల పైకప్పులలోనే దాగి ఉంది.

AndhraPravasi News Desk 2 min read
Clay Pots: మట్టి కుండలతో చల్లని ఇళ్లు… విద్యుత్ ఖర్చు తగ్గించే తెలివైన పద్ధతి!

ఎండాకాలంలో కూడా ఇల్లు కూల్ కూల్.. 

పురాతన పద్ధతి మళ్ళీ అమలులోకి.. 

ఎండాకాలం ముదురుతున్న కొద్దీ మధ్యాహ్నానికి ఇళ్లలో ఉండటం చాలా కష్టంగా మారుతోంది. ఇంటి పైకప్పు వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది, ఫ్యాన్లు ఫుల్ స్పీడ్‌లో తిరిగినా గాలి గట్టిగా, భారంగా అనిపిస్తోంది. ఇది కేవలం మనకు అనిపించేది మాత్రమే కాదు… రోజంతా సూర్యకిరణాలను పీల్చుకున్న పైకప్పు ఆ వేడిని నెమ్మదిగా ఇళ్లలోకి విడుదల చేస్తోంది.

ఈ పరిస్థితిలో చాలా మంది ఎయిర్ కండిషనర్లపై ఆధారపడుతున్నారు. కానీ అవి ఖర్చుతో పాటు పర్యావరణంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం లేకుండా ఇళ్లు చల్లగా ఉంచే మార్గాలపై మళ్లీ చర్చ మొదలైంది.

పాత పద్ధతిలో కొత్త పరిష్కారం 
ఈ సమస్యకు సమాధానం మన ఇళ్ల పైకప్పులలోనే దాగి ఉంది. మట్టి కుండల వినియోగంతో రూపొందించే “ఫిల్లర్ స్లాబ్” అనే పద్ధతి ఇప్పుడు మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తోంది.

ఈ విధానంలో పైకప్పు నిర్మాణ సమయంలో మట్టి కుండలను తలకిందులుగా అమర్చి, వాటి చుట్టూ కాంక్రీట్ పోస్తారు. కాంక్రీట్ గట్టిపడిన తర్వాత ఆ కుండలు చిన్న చిన్న ఎయిర్ గ్యాప్స్ (ఎయిర్ పాకెట్స్) సృష్టిస్తాయి.

ఈ ఎయిర్ గ్యాప్స్ ఖాళీలు సహజ ఇన్సులేషన్‌లా పనిచేసి, పైకప్పు నుంచి వచ్చే వేడి ఇళ్లలోకి చేరడాన్ని తగ్గిస్తాయి. మట్టి సహజంగా వేడి ప్రవేశాన్ని నిరోధించే గుణం కలిగి ఉండటం మరో ప్రయోజనం.

ఈ పద్ధతి ద్వారా ఇళ్లలో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. కొన్నిసార్లు 50 శాతం వరకు చల్లదనం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మట్టి కుండలు తక్కువ ఖర్చుతో సులభంగా లభిస్తాయి. సాంకేతికత కూడా క్లిష్టం కాదు. సంప్రదాయ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ పద్ధతి పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.

ఇంటి లోపల వేడి తగ్గడంతో ఎయిర్ కండిషనర్ల అవసరం తగ్గుతుంది. దీంతో విద్యుత్ బిల్లులు కూడా తగ్గి, పర్యావరణం లో కార్బన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ ఎయిర్ గ్యాప్స్ వేసవిలో ఇల్లు చల్లగా ఉంచడమే కాకుండా, చలికాలంలో వేడిని నిలుపుకోవడంలో కూడా సహాయపడతాయి. దీంతో సంవత్సరమంతా ఇల్లు సౌకర్యంగా ఉంటుంది.

ఇప్పటి ఆధునిక నిర్మాణాల్లో వేగం, ఒకే రకం డిజైన్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ పాత కాలంలో భారతీయ నిర్మాణ శైలులు వాతావరణానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి.

పట్టణాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ఈ కాలంలో, చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. సాధారణ మట్టి కుండల్లోనే చల్లని, సుస్థిర జీవనానికి మార్గం దాగి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…