LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Weather: రాష్ట్రంలో మూడు రోజులు విభిన్న వాతావరణం.. ఎండలు, పిడుగులతో వర్షాలు!

Weather: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు ఉండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

AndhraPravasi News Desk 1 min read
Weather: రాష్ట్రంలో మూడు రోజులు విభిన్న వాతావరణం.. ఎండలు, పిడుగులతో వర్షాలు!

తీవ్ర ఎండలు ఉండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు..

తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి..

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు ఉండగా, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం (మే 5) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

వర్షాల సమయంలో రైతులు, కూలీలు, పశు కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుములు, పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.

ఇక మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగనుంది. ఉక్కపోత, వేడి కారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే ఉన్నాయి. కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 43.9°C, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పులో 43.1°C, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 42.9°C నమోదయ్యాయి. మార్కాపురం పెద్దదోర్నాల, నెల్లూరు గూడూరు, శ్రీకాకుళం తామాడలో 42.7°C, కడప జమ్మలమడుగులో 42.6°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అలాగే ఏలూరు ధర్మాజీగూడెంలో 42.2°C, కర్నూలు మంత్రాలయంలో 42°C, అనంతపురం తెరన్నపల్లిలో 41.9°C, పల్నాడు అమరావతిలో 41.8°C నమోదయ్యాయి. చిత్తూరు తవణంపల్లెలో 41.6°C, గుంటూరులో 41.3°C, ప్రకాశం మర్రిపూడిలో కూడా 41.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 16 జిల్లాల పరిధిలోని 74 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ఎండ తీవ్ర ప్రభావం కనిపించిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు ఉండే పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…