LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Heat: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. ప్రజలకు హెచ్చరిక!

Heat: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

AndhraPravasi News Desk 2 min read
Heat: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. ప్రజలకు హెచ్చరిక!

227 మండలాల్లో 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు..

19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. వర్షాలకు కూడా అవకాశం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 28 జిల్లాల్లో 20 జిల్లాలకు చెందిన 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం (28-04-2026) కూడా పరిస్థితి ఇలానే కొనసాగుతుందని, 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 21 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

మరోవైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వాతావరణ మార్పులు కనిపించనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులు పడే సమయంలో రైతులు, పశుకాపరులు చెట్ల కింద నిలబడకూడదని ప్రత్యేకంగా హెచ్చరించారు.

తీవ్ర వడగాల్పులు వీచే మండలాలుగా విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, రామభద్రాపురం, తెర్లాం, వంగర; పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం వంటి మండలాలను అధికారులు గుర్తించారు.

ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1°C, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.8°C, అమరావతిలో 44.2°C, తిరుపతి జిల్లా బేస్తపల్లి, వైఎస్సార్ కడప జిల్లా వీరబల్లిలో 44.2°C, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44°C నమోదయ్యాయి. అలాగే అన్నమయ్య జిల్లా నూలివీడులో 43.1°C, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43°C, కర్నూలు జిల్లా కల్లూరు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.7°C, కాకినాడ జిల్లా కరపలో 42.4°C, శ్రీసత్యసాయి జిల్లా ముడిగుబ్బలో 42.3°C, మన్యం జిల్లా బూర్జ, అనంతపురంలో 42.2°C, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, విజయనగరం జిల్లా రాజాంలో 41.7°C, బాపట్ల జిల్లా మార్టూరులో 41.6°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లెలో 41.5°C నమోదైనట్లు వెల్లడించారు.

ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. దాహం లేకపోయినా తరచూ నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని సూచించారు. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలకు గుడ్డ కట్టుకోవడం, చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం, కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ధరించడం వంటి సూచనలు ఇచ్చారు.

ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మరోసారి విజ్ఞప్తి చేసింది.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…