LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్!

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్!

వడగాలులతో ఢిల్లీ వణుకు.. ఐఎండీ హెచ్చరికలు..

దేశ రాజధానిపై ఎండల ఎఫెక్ట్.. వడగాలులపై ఎల్లో అలర్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వచ్చే మూడు రోజుల పాటు ఢిల్లీలో వడగాలుల పరిస్థితులు కొనసాగనున్నాయని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందని తెలిపింది.

ఐఎండీ అంచనాల ప్రకారం, ఇవాళ ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండొచ్చని పేర్కొంది. గత 24 గంటల్లో కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల వద్ద కొనసాగడంతో ప్రజలకు ఉపశమనం లేకుండా పోయింది.

ఢిల్లీ రిడ్జ్ ప్రాంతంలోని ఐఎండీ కేంద్రంలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్దర్‌జంగ్ కేంద్రంలో 43.4 డిగ్రీలు, లోధీ రోడ్ కేంద్రంలో 43.8 డిగ్రీలు, పాలం ప్రాంతంలో 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. ఉదయం నుంచే మండుతున్న ఎండలు, వేడిగాలులతో రహదారులు వెలవెలబోతున్నాయి.

వైద్య నిపుణులు ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…