Health Tips: ఎండాకాలంలో రాగి, బార్లీ జావలు... ఎవరికి ఏది మంచిదో తెలుసా? Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Arunachalam: భక్తులకు అలర్ట్.. 2026లో అరుణాచలం గిరి ప్రదక్షిణకు ముఖ్య తేదీలు! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో Chandrababu: చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికి పెన్షన్ పెంపు! ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు... Parliament's Budget Meeting: ఢిల్లీలో పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం! Indian Cricketer: పెళ్లి పీటలెక్కబోతున్న టీమ్ ఇండియా క్రికెటర్.. వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫోటోలు! IDBI Recruitment: రూ. 6.50 లక్షల జీతంతో బ్యాంక్ కొలువులు..! ఐడీబీఐ భారీ నోటిఫికేషన్ విడుదల! Health Tips: ఎండాకాలంలో రాగి, బార్లీ జావలు... ఎవరికి ఏది మంచిదో తెలుసా? Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Arunachalam: భక్తులకు అలర్ట్.. 2026లో అరుణాచలం గిరి ప్రదక్షిణకు ముఖ్య తేదీలు! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో Chandrababu: చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికి పెన్షన్ పెంపు! ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు... Parliament's Budget Meeting: ఢిల్లీలో పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం! Indian Cricketer: పెళ్లి పీటలెక్కబోతున్న టీమ్ ఇండియా క్రికెటర్.. వైరల్ అవుతున్న ఎంగేజ్‌మెంట్ ఫోటోలు! IDBI Recruitment: రూ. 6.50 లక్షల జీతంతో బ్యాంక్ కొలువులు..! ఐడీబీఐ భారీ నోటిఫికేషన్ విడుదల!

Madras High Court: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అవసరం… కేంద్రానికి మద్రాస్ హైకోర్టు కీలక సూచన!!

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగం ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయని న్యాయస్థానాలు గుర్తిస్తున్నాయి . ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఒక కీలక సూచన చేసింది. సోష

Published : 2025-12-27 12:18:00
Revenue Clinics: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! భూసమస్యలకు చెక్ పెట్టే రెవెన్యూ క్లినిక్‌లు!

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగం ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయని న్యాయస్థానాలు గుర్తిస్తున్నాయి . ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఒక కీలక సూచన చేసింది. సోషల్ మీడియా కారణంగా పిల్లల మానసిక ఆరోగ్యం, శారీరక అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చిన్న వయసులోనే పిల్లలు అశ్లీల కంటెంట్, హింసాత్మక వీడియోలు, తప్పుదారి పట్టించే సమాచారానికి గురవుతున్నారని పేర్కొంది. ఈ పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించింది.

Water Management: సముద్రాన్ని వెనక్కి నెట్టి కొత్త రాష్ట్రం సృష్టించిన దేశం – ఎలా చేశారంటే ఆశ్చర్యపోతారు!!

ఇంటర్నెట్ వినియోగం పెరిగిన కొద్దీ పిల్లలు తెలియకుండానే అనేక రకాల డిజిటల్ ప్రమాదాల్లో పడుతున్నారని కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికల ద్వారా పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం పెరుగుతోందని, ఇది వారి చదువుపై కూడా ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించింది. ఈ అంశాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును విచారించిన ధర్మాసనంలో జస్టిస్ జి. జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ ఉన్నారు.

Railway Project: ఆ రెండు రైల్వే స్టేషన్‌లకు మహర్దశ! రూ.350 కోట్లతో కొత్త రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం... ఇక ఆ సమస్యలుండవు!

ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిందని పేర్కొంది. అదే తరహాలో భారతదేశంలో కూడా ఇలాంటి చట్టం అవసరమా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. కొత్త చట్టం వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న ఐటీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

Highway Connectivity: ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు... ఆ హైవే తో కనెక్ట్! రూ.384 కోట్లతో ఈ రూట్లోనే ఫిక్స్!

పిల్లలు ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు అన్నదానిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఇచ్చినంత మాత్రాన బాధ్యత ముగిసినట్టుకాదని, వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను గమనించాల్సిందేనని చెప్పింది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లలో పేరెంటల్ కంట్రోల్ యాప్‌లు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది. ఈ యాప్‌ల వాడకం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లదేనని కోర్టు అభిప్రాయపడింది.

Sthree Shakti Bus: స్త్రీ శక్తి పథకం మరో కీలక ముందడుగు! ఉచితంగా పవర్‌ బ్యాంకులు... ఆ టెన్షన్ ఉండదు!

పాఠశాలల్లో పిల్లలకు చైల్డ్ రైట్స్, ఇంటర్నెట్ భద్రతపై పాఠాలు చెబుతున్నా అవి సరిపోవడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రాక్టికల్ అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఈ విషయంలో జాతీయ, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు మరింత చురుకుగా వ్యవహరించాలని కోర్టు కోరింది.

Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం... ప్రముఖ హీరోయిన్ కుటుంబానికి షాక్!

అదే సమయంలో అభ్యంతరకరమైన వెబ్‌సైట్లు, అనుచిత వీడియోలు, హానికరమైన కంటెంట్‌ను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తరచూ సమీక్షించి బ్లాక్ చేయాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. పిల్లల భద్రత అనేది కేవలం కుటుంబాల బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వాలు, సంస్థలు, సమాజం మొత్తం కలిసి బాధ్యత తీసుకోవాల్సిన అంశమని పేర్కొంది. డిజిటల్ యుగంలో పిల్లలను కాపాడాలంటే బలమైన చట్టపరమైన రక్షణలు తప్పనిసరని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అప్‌గ్రేడ్… రైల్వే తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ఆ నాలుగు ప్రాంతాలకి మహార్దశ..!!
Sankranti Holidays: విద్యార్థులకు పండగే పండగ.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. పూర్తి వివరాలు మీకోసం!
iPhone: ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో భారీ మార్పులు! ధర, ఫీచర్లు ఇవే!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 48 నగరాల్లో రెట్టింపు కానున్న రైళ్ల సామర్థ్యం! తెలుగు రాష్ట్రాల్లోని స్టేషన్లు ఇవే!

Spotlight

Read More →