LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gulf

TDP 44th Anniversary: కువైట్‌లో హోరెత్తిన టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు.. భారీ రక్తదాన శిబిరంతో మానవత్వం చాటిన ఎన్నారై తెలుగుదేశం జనసేన సైన్యం!

TDP 44th Anniversary: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కువైట్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ మేరకు వందలాది మంది కార్యకర్తలు రక్తదానం చేయగా, దాతలకు ఏపీ ప్రభుత్వం అందించే 'ప్రవాసాంధ్ర భరోసా' బీమాను ఉచితంగా అందజేశారు.

AndhraPravasi News Desk 2 min read
TDP 44th Anniversary: కువైట్‌లో హోరెత్తిన టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు.. భారీ రక్తదాన శిబిరంతో మానవత్వం చాటిన ఎన్నారై తెలుగుదేశం జనసేన సైన్యం!

Kuwait City: తెలుగుదేశం పార్టీ 44వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని, కువైట్‌లోని ఎన్నారై టీడీపీ విభాగం వినూత్నంగా స్పందించింది. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి తమకు  పార్టీపై ఉన్న మక్కువను చాటుకున్నారు. గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు పర్యవేక్షణలో, మద్దిన ఈశ్వర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ప్రవాసాంధ్రులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ప్రస్తుతం కువైట్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, అక్కడి ప్రభుత్వం స్వచ్ఛంద రక్తదానం చేయాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు స్పందించిన టీడీపీ నేతలు బిల్లా రమేష్ సారథ్యంలో ఏకంగా మూడు రోజుల పాటు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం సెలవు దినం కావడంతో కువైట్‌లోని వివిధ ప్రాంతాల నుండి ‘పసుపు తమ్ముళ్లు’ భారీ సంఖ్యలో తరలివచ్చారు. అదాన్ బ్లడ్ బ్యాంక్  జాబ్రియా సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ వేదికలుగా జరిగిన ఈ రక్తదాన క్రతువులో వందలాది మంది పాల్గొని ప్రాణదాతలుగా నిలిచారు.

ఈ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంతకం చేసిన ప్రశంసా పత్రాలను అందజేశారు. పల్లా శ్రీనివాసరావు గారు వీడియో సందేశం ద్వారా ధాతలను అభినందిస్తూ.. "మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందని, పార్టీ సిద్ధాంతమైన 'సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు' అనే నినాదానికి ఇది నిదర్శనం" అని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎన్నారైలు ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఒక విశేషమైన అడుగు పడింది. రక్తదానం చేసిన ప్రతి దాతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారైల కోసం ప్రవేశపెట్టిన ‘ప్రవాసాంధ్ర భరోసా’ బీమాను ఉచితంగా కల్పించారు. దీనికి అయ్యే ఒక్కొక్కరి ప్రీమియం ₹590లను ప్రముఖ నేత బిల్లా రమేష్ గారు స్వయంగా భరించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రక్తదానం చేసిన వారికి తక్షణ శక్తి కోసం పండ్లు, జ్యూస్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ విజయంలో కీలక పాత్ర పోషించిన షేక్ బాషా, దుర్గాప్రసాద్ ఈడుపుగంటి, వి.సి. సుబ్బారెడ్డి తదితరులను సుధాకర రావు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ వేడుకల్లో టీడీపీతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు భుజం భుజం కలిపి పని చేయడం విశేషం. కార్యక్రమంలో రషీదా బేగం, ఖాదరున్, కొల్లి ఆంజనేయులు వంటి టీడీపీ నేతలతో పాటు జనసేన తరపున కంచన శ్రీకాంత్, అంజన కుమార్ పగడాల, రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. కువైట్ లో తెలుగు వారందరూ కలిసికట్టుగా చేసిన ఈ రక్తదాన శిబిరం స్థానిక అధికారుల ప్రశంసలు కూడా అందుకుంది.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామా…