GLMC 2026: సౌదీ అరేబియాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం! Saudi Arabia: హజ్ యాత్ర 2026... సౌదీ ప్రభుత్వం కొత్త నిబంధనలు! యాత్రికులు తెలుసుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు! Saudi Aramco: సౌదీ అరాంకో సరికొత్త రికార్డు! గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా సౌదీ అరేబియా! ప్రవాసులకు గుడ్ న్యూస్..! కువైట్ వీసా చట్టాల్లో కీలక సడలింపులు! కువైట్‌తో దశాబ్దాల స్నేహానికి గుర్తుగా UAE లో భారీ ఉత్సవాలు! GLMC 2026: సౌదీ అరేబియాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం! Saudi Arabia: హజ్ యాత్ర 2026... సౌదీ ప్రభుత్వం కొత్త నిబంధనలు! యాత్రికులు తెలుసుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు! Saudi Aramco: సౌదీ అరాంకో సరికొత్త రికార్డు! గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా సౌదీ అరేబియా! ప్రవాసులకు గుడ్ న్యూస్..! కువైట్ వీసా చట్టాల్లో కీలక సడలింపులు! కువైట్‌తో దశాబ్దాల స్నేహానికి గుర్తుగా UAE లో భారీ ఉత్సవాలు!

CM Pravasi Prajavani: కల్లుకు బానిసై గ్రామంలో జీవితం నాశనం… గల్ఫ్‌లో మతిస్థిమితం.. సహాయం కోరుతూ సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతి!

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెరుమాల్ల గ్రామానికి చెందిన గిరిజన కార్మికుడు మాలోత్ శ్రీరాం ప్రస్తుతం యూఏఈ రాజధాని అబుదాబి లోని ముసఫ్ఫా ప్రాంతంలో ఆశ్రయం, ఆహార

Published : 2025-12-24 20:43:00
Farmers payments: రైతు ఖాతాల్లోకి నగదు వర్షం.. ధాన్యం అమ్ముకున్న 48 గంటల్లోనే చెల్లింపులు!

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెరుమాల్ల గ్రామానికి చెందిన గిరిజన కార్మికుడు మాలోత్ శ్రీరాం ప్రస్తుతం యూఏఈ రాజధాని అబుదాబి లోని ముసఫ్ఫా ప్రాంతంలో ఆశ్రయం, ఆహారం లేక రోడ్లపై భిక్షాటన చేస్తూ జీవిస్తున్న హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. లేబర్ క్యాంప్ (కార్మికుల నివాస సముదాయం) లోకి తిరిగి ప్రవేశాన్ని నిరాకరించిన కంపెనీ యాజమాన్యం అమానవీయంగా వ్యవహరించడమే దీనికి కారణంగా ఆరోపణలు ఉన్నాయి.

BSNL: BSNL న్యూ ఇయర్ బంపర్ ఆఫర్.. ₹251కే 100GB డేటా!

ఈ విషయమై బాధితుడి భార్య సునీత మంగళవారం (23.12.2025) హైదరాబాద్‌లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎం. మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లకు ప్రతులు అందజేశారు.

TDP: తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీలు విడుదల… జిల్లాలవారీగా లిస్ట్!

మంద భీంరెడ్డి వెంట రాగా, బాధితుడి భార్య సునీత 'సీఎం ప్రజావాణి' ఇంచార్జి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన చిన్నారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రికి లేఖ రాశారు. ఇదిలా ఉండగా, శ్రీరాంను స్వదేశానికి పంపించే ప్రయత్నాల్లో అబుదాబిలో నివసిస్తున్న తెలంగాణ సామాజిక సేవకురాలు, వేములవాడకు చెందిన ప్రియా సింగిరెడ్డి కంపెనీ యాజమాన్యం, భారత రాయబార కార్యాలయం తో సమన్వయం చేస్తున్నారు.

Dhurandhar: వరల్డ్‌వైడ్ వసూళ్లతో సంచలనం సృష్టించిన రణ్వీర్ సింగ్ చిత్రం.. ఈ ఏడాది నంబర్–1 సినిమా ధురంధర్!

యూఏఈలోని వరల్డ్ స్టార్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కంపెనీలో క్లీనర్ వీసాపై నవంబర్ 11న అబుదాబి కి చేరుకున్న మాలోత్ శ్రీరాం, మతిస్థిమితం కోల్పోయి నవంబర్ 13న ముసఫ్ఫా ప్రాంతం లోని కంపెనీ లేబర్ క్యాంప్ నుంచి అదృశ్యమయ్యారు. సుమారు నెల రోజుల తర్వాత ఆయనను ఎవరో తిరిగి క్యాంప్‌కు చేర్చినా, కంపెనీ యాజమాన్యం ఆయనను లోపలికి అనుమతించకుండా అమానుషంగా వ్యవహరించింది.

Rushikonda Palace: రుషికొండ భవనాలపై కీలక అప్‌డేట్.. లగ్జరీ హోటళ్ల నిర్వహణకు నో చెప్పిన ఆ సంస్థలు!.!!

దీంతో ప్రస్తుతం శ్రీరాం ఆశ్రయం, ఆహారం, కనీస మానవ గౌరవం లేకుండా రోడ్లపై జీవిస్తున్నాడు. తిండి కోసం భిక్షాటన చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, కంపెనీ అతనిపై 'అబుస్కాండింగ్' (పారిపోయాడు) అనే  కేసు నమోదు చేసింది. అతడిని స్వదేశానికి పంపడానికి, 'డిపోర్ట్' (దేశ బహిష్కరణ) చేయడం కోసం 4,500 దిర్హములు (సుమారు ₹1.10 లక్షలు) జరిమానా చెల్లించాలని కంపెనీ డిమాండ్ చేస్తోంది.

New Airlines: అల్ హింద్, ప్లె ఎక్స్‌ప్రెస్‌కు కేంద్ర పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్!

శ్రీరాం స్వగ్రామంలో ఉన్న సమయంలో సంప్రదాయ ప్రకృతి సహజ పానీయాలైన తాటి, ఈత కల్లు సేవించే అలవాటు కలిగి ఉన్నారు. ఆయన సేవించిన కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు కలిపి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూఏఈలో అలాంటి పానీయాలు లభించకపోవడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఇది వైద్య నిపుణుల ద్వారా మానసిక వైద్య పరీక్షలు, టాక్సికాలజీ ఆధారాలతో నిర్ధారించవలసిన అంశం.

Film industry: సామాన్యులకు భారం లేకుండా, సినీ పరిశ్రమకు మేలు.... మంత్రి కందుల దుర్గేష్!

భారత్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో తక్షణ వైద్య చికిత్స, పునరావాసం కల్పించాల్సిన అత్యవసర అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని, న్యూఢిల్లీ లోని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అబుదాబి లోని భారత రాయబార కార్యాలయం ద్వారా తగిన చర్యలు తీసుకొని, శ్రీరాంను సురక్షితంగా, త్వరితగతిన హైదరాబాద్‌కు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని అతని భార్య సునీత విజ్ఞప్తి చేశారు. తమది అత్యంత పేద కుటుంబమని, కంపెనీ డిమాండ్ చేస్తున్న భారీ జరిమానా గానీ, స్వదేశానికి తీసుకురావడానికి కావలసిన ఖర్చులు గానీ భరించే స్థితిలో తాము లేమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ISRO: భారత్‌కు అతిపెద్ద వాణిజ్య అంతరిక్ష ప్రయోగం ఇదే.. గత రికార్డు 4400 కేజీలు.. ఇప్పుడు 6100 కేజీలు!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీలో కొత్త దిశ!!
Electric Scooter: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెంపు!
PAN-Aadhaar: పాన్- ఆధార్ లింక్, డిసెంబర్ 31 వరకే గడువు... లింక్ చేశారో? లేదో... ఇలా చెక్ చేసుకోండి!
Family Survey: ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే.. అర్హులు అనర్హుల గుర్తింపు!
Real Estate Amaravati: అమరావతిలోని ఈ ప్రాంతం భవిష్యత్తులో మరో KPHB కాలనీ అయ్యే అవకాశం... ఎక్కడో తెలుసా!

Spotlight

Read More →