AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీలో కొత్త దిశ!!

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటక రంగాన్ని మరింత బలపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేయబోతోంది. రాష్ట్రానికి వచ్చే ప్రతి పర్యటకుడికి పూర్తి భద్రతతో పాటు సానుకూల అన

Published : 2025-12-24 14:36:00
Electric Scooter: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెంపు!

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటక రంగాన్ని మరింత బలపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేయబోతోంది. రాష్ట్రానికి వచ్చే ప్రతి పర్యటకుడికి పూర్తి భద్రతతో పాటు సానుకూల అనుభవం కలగాలనే లక్ష్యంతో టూరిజం సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ పాలసీ రూపకల్పన అవసరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పర్యాటకం కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఉపాధి కల్పనకు కూడా కీలక సాధనంగా మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యువతకు, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచే శక్తి పర్యటక రంగానికి ఉందని పేర్కొన్నారు.

PAN-Aadhaar: పాన్- ఆధార్ లింక్, డిసెంబర్ 31 వరకే గడువు... లింక్ చేశారో? లేదో... ఇలా చెక్ చేసుకోండి!

రాష్ట్రానికి వచ్చిన పర్యటకులు సురక్షితంగా, సంతోషంగా తిరిగి వెళ్లాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ముఖ్యంగా కుటుంబాలతో వచ్చే పర్యటకులు, మహిళా పర్యటకులకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ దిశగా ప్రత్యేక విధానాలు తీసుకురావాలని, పర్యటక ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ ప్రాంతాలు, ఎకో టూరిజం కేంద్రాలను సందర్శించే వారికి కూడా తగిన భద్రతా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.

Family Survey: ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే.. అర్హులు అనర్హుల గుర్తింపు!

పర్యాటక అభివృద్ధి, ఉపాధి కల్పనపై సోమవారం జరిగిన సమన్వయ సమావేశంలో పర్యాటక, దేవాదాయ, రోడ్లు భవనాల శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరుకాగా, దేవాదాయ శాఖ మంత్రి అనం రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యటక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

Real Estate Amaravati: అమరావతిలోని ఈ ప్రాంతం భవిష్యత్తులో మరో KPHB కాలనీ అయ్యే అవకాశం... ఎక్కడో తెలుసా!

పర్యటకులతో స్థానికులు, హోటల్ నిర్వాహకులు, ట్రావెల్స్ నిర్వాహకులు ఎలా మసలుకోవాలన్న అంశంపై ప్రత్యేక ప్రవర్తనా నియమావళి రూపొందించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. పర్యాటక ప్రాంతాల్లో ఒకే తరహా నిర్మాణ శైలి ఉండేలా చూడాలని, ఆ నిర్మాణాల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలని చెప్పారు. ఇది అంతరించిపోతున్న కళలకు కొత్త ఊపిరి పోసేలా ఉండాలని అభిప్రాయపడ్డారు.

Airtel Offer: జాగ్రత్త.. ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్! ఆ ఆఫర్‌లో కొత్త కండీషన్.. మీ డబ్బులు కట్ అయ్యే ఛాన్స్.!

టూరిజం హాట్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో హెలీ టూరిజం, హెలీపోర్టుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నిర్ణీత కాలవ్యవధిలో ఈ పనులు పూర్తయ్యేలా కార్యాచరణ ఉండాలని తెలిపారు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని అడ్వెంచర్ టూరిజం, జలక్రీడలు, బోటు పోటీలు నిర్వహించడం ద్వారా దేశ విదేశాల పర్యటకులను ఆకర్షించవచ్చని చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల్లో పర్యాటక కార్యక్రమాలు అభివృద్ధి చేయాలని సూచించారు.

ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికాను స్వచ్ఛందంగా వీడేవారికి భారీ నగదు ప్రోత్సాహకం - మిస్ అయితే అరెస్ట్ తప్పదు!

మంగళగిరి, కొండపల్లి, సిద్ధవటం వంటి కొండ ప్రాంతాల్లో పర్వతారోహణకు అనువైన వసతులు కల్పించాలని, పార్వతీపురం మన్యం వంటి ప్రాంతాల్లో ఉన్న సహజ సౌందర్యాన్ని వారసత్వ సంపదగా గుర్తించి పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా “ఇది ఆంధ్రప్రదేశ్” అనే భావన పర్యటకులకు కలగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ విధంగా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, సంస్కృతి పరిరక్షణతో కూడిన పర్యాటక అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

శ్రీవారి దర్శనానికి 18 గంటల నిరీక్షణ.. భక్తుల కోసం లేటెస్ట్ అప్‌డేట్స్! నిన్న 61 వేల మందికి పైగా..
Atal Modis: అటల్ మోదీ సుపరిపాలన యాత్ర రెండు దశల్లో విజయవంతం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్!
New Rules from January 2026: కొత్త ఏడాది.. కొత్త మార్పులు! మీరు తెలుసుకోవాల్సిన కీలక అప్‌డేట్స్ - మరో వారం రోజుల్లో..
మద్యం ప్రియులకు హెచ్చరిక.. సైడ్ డిష్‌గా ఇవి తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే! ఆరోగ్య రహస్యాలివే..

Spotlight

Read More →