LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gulf

UAE Attack: ఇరాన్‌పై భారత్ ఫైర్.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. భారతీయుల భద్రతపై విదేశాంగ శాఖ ఘాటు స్పందన!

UAE Attack: పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా, ఇరాన్ దాడులతో యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా యూఏఈలోని ‘ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్’పై దాడి చేయడం పరిస్థితులను మరింత దిగజార్చాయి.

AndhraPravasi News Desk 1 min read
UAE Attack: ఇరాన్‌పై భారత్ ఫైర్.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. భారతీయుల భద్రతపై విదేశాంగ శాఖ ఘాటు స్పందన!
  • Gulf: హర్మూజ్‌నూ తెరవాలని పిలుపు..
     
  • అంగీకరించలేమని భారత్ ఫైర్..

UAE Attack: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దాడుల రూపం దాల్చడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లోని వ్యూహాత్మక ప్రాంతమైన ‘ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్’ లక్ష్యంగా జరిగిన దాడి ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. ఈ పెట్రోలియం జోన్‌పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని భారత్ స్పష్టం చేసింది.

భారతీయులు గాయపడిన ఈ ఘటనను విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణిస్తూ ఘాటుగా స్పందించింది. ‘‘ముగ్గురు భారతీయుల గాయానికి కారణమైన ఫుజైరా దాడిని ఏమాత్రం అంగీకరించలేం. వెంటనే ఈ ఘర్షణలను విరమించుకోవాలని, పౌర మౌలిక సదుపాయాలు మరియు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం తక్షణమే ఆపాలని కోరుతున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ ‘ఎక్స్‌’ వేదికగా డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొన్న తరుణంలో భారత విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వం నెలకొనేలా సాగే చర్చలకు, దౌత్య పరమైన ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడి హర్మూజ్ జలసంధి మీదుగా స్వేచ్ఛాయుత నౌకాయానం మరియు ప్రపంచ వాణిజ్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగేలా అన్ని పక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని కోరింది. సమస్యలు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ వాటిని చర్చల ద్వారా, శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని భారత్ సూచించింది. ప్రపంచ ఇంధన అవసరాలకు కీలకంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే అది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామా…