LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gulf

Iran War: భారీ షాక్.. ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా కఠిన ఆంక్షలు.! రోజుకు రూ.4,081 కోట్ల నష్టం!

Iran War: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హ‌ర్మూజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. ఈ చర్యతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్ర…

AndhraPravasi News Desk 2 min read
Iran War: భారీ షాక్.. ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా కఠిన ఆంక్షలు.! రోజుకు రూ.4,081 కోట్ల నష్టం!
  • "హర్మూజ్ దిగ్బంధనం షురూ": ఇరాన్ ఓడరేవులను చుట్టుముట్టిన అమెరికా దళాలు..
     
  • Gulf: విఫలమైన శాంతి చర్చలు: ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ సంచలన నిర్ణయం..

Iran War: అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత క్లిష్ట దశకు చేరుకున్నాయి. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠినమైన చర్య వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడనుందని 'వాల్ స్ట్రీట్ జర్నల్' తన తాజా కథనంలో విశ్లేషించింది. ఈ దిగ్బంధం కారణంగా ఇరాన్‌కు ప్రతిరోజూ సుమారు 435 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 4,081 కోట్లు) భారీ నష్టం వాటిల్లవచ్చని అంచనా వేసింది. కాల్పుల విరమణ చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఇరాన్‌ను దారికి తెచ్చేందుకు ట్రంప్ యంత్రాంగం ఈ ఆర్థిక యుద్ధాన్ని ఎంచుకుంది.

సోమవారం నుంచే అమల్లోకి వచ్చిన ఈ దిగ్బంధనం ద్వారా ఇరాన్ యొక్క ప్రధాన ఎగుమతులైన ముడిచమురు, పెట్రోకెమికల్స్, ఎరువులు మరియు ఆహార పదార్థాల రవాణాను పూర్తిగా అడ్డుకోనున్నారు. ముఖ్యంగా ఇరాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలకు ఆధారమైన చమురు మరియు పెట్రోకెమికల్ ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ఆ దేశం రోజుకు 276 మిలియన్ డాలర్లు నష్టపోయే ప్రమాదం ఉందని అమెరికా ట్రెజరీ మాజీ అధికారి మియాద్ మలేకి విశ్లేషించారు. చమురు ఆదాయంపైనే ఆధారపడి బడ్జెట్‌ను రూపొందించుకునే ఇరాన్ వంటి దేశానికి ఇది అత్యంత గడ్డు కాలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ ఆర్థిక నష్టం తీవ్రత అనేది అమెరికా అమలు చేసే దిగ్బంధనం ఎంత పటిష్ఠంగా ఉంటుందనే అంశంపై ఆధారపడి ఉంటుంది. హర్మూజ్ జలసంధికి వెలుపల ఉన్న జాస్క్ టెర్మినల్ ద్వారా తన చమురు నిల్వలను ఇతర దేశాలకు మళ్లించేందుకు ఇరాన్ ప్రయత్నించే అవకాశం ఉందని, అప్పుడు నష్టం కొంత మేర తగ్గే వీలుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ప్రస్తుతం సముద్ర మార్గంలో నౌకల్లో నిల్వ ఉన్న 154 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు నిల్వలు తక్షణ నష్టాన్ని కొంతవరకు భర్తీ చేయగలవని కెప్లర్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఏది ఏమైనా, హర్మూజ్ జలసంధి వేదికగా జరుగుతున్న ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలను కమ్ముకొచ్చేలా చేస్తున్నాయి.

అమలు అమెరికాకు సవాలేనా?
ఈ దిగ్బంధనాన్ని అమలు చేయడం అమెరికాకు పెద్ద సవాలుగా మారనుంది. హ‌ర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన నౌకా మార్గాల్లో ఒకటి. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 20% చమురు ఇటునుంచే రవాణా అవుతుంది. ఇంత భారీ నౌకా రద్దీని నియంత్రించడం కష్టం. మధ్యప్రాచ్యంలో అమెరికాకు చెందిన 16 యుద్ధనౌకలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో ఒక్కటి కూడా లేదని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో దిగ్బంధనాన్ని అమలు చేయడం కష్టసాధ్యమని రక్షణ రంగ నిపుణుడు సిద్ధార్థ్ కౌశల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇరాన్ నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకునే చైనాకు ఇబ్బందులు సృష్టించడం ద్వారా, ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు తమతో చేతులు కలపాలని బీజింగ్‌ను ప్రేరేపించడం కూడా అమెరికా వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. మొత్తంగా అమెరికా దిగ్బంధనాన్ని ప్రకటించినప్పటికీ, దాని ఆచరణ, విజయం మాత్రం అనేక సవాళ్లతో కూడి ఉందని స్పష్టమవుతోంది.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామా…