భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహంపై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. వీరిద్దరి పెళ్లి వాయిదా పడిందన్న వార్తలు బయటకు రావడంతో, కొందరు నెటిజన్లు సంబంధం పూర్తిగా తెగిపోయిందని, పెళ్లే రద్దు చేసుకున్నారని ప్రచారం చేశారు. ముఖ్యంగా స్మృతి తన ఇన్స్టాగ్రామ్లో పెళ్లికి సంబంధించిన ఫోటోలు, పోస్టులు డిలీట్ చేసినట్టు కనిపించడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరింది. పలువురు అభిమానులు "ఎందుకు పెళ్లి రద్దైంది?", "ఇద్దరి మధ్య ఏం జరిగింది?" అంటూ ఆన్లైన్లో ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా స్మృతి మంధాన మరియు పలాష్ ఇద్దరూ తమ ఇన్స్టా బయోలో ఒకే దిష్టి ఎమోజీని యాడ్ చేయడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. ఈ ఎమోజీని ఇద్దరూ ఒకేసారి తమ ప్రొఫైల్లో పెట్టడం చూస్తే, వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవు.. సంబంధం బాగానే ఉంది.. బయట ప్రచారం అవుతున్నవన్నీ రూమర్స్ మాత్రమే అనే మెసేజ్ను ఇచ్చే ప్రయత్నంగా నెటిజన్లు భావిస్తున్నారు.
కొంతమంది అభిమానులు కామెంట్లలో,
దిష్టి తగిలిందేమోగానీ.. ప్రేమ మాత్రం అలాగే ఉందన్నమాట!,
ఇద్దరూ స్ట్రాంగ్ కపుల్.. బయట రూమర్స్కు రియాక్షన్ ఇది,
బయటి ఒత్తిడుల వల్ల పెళ్లి వాయిదా అయ్యి ఉండొచ్చు.. క్వారెల్స్ ఏమీ లేవన్న సంకేతం
అని స్పందిస్తున్నారు.
మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం “ఎమోజీ పెట్టడమే క్లారిటీ అయ్యిందా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారికంగా స్మృతి లేదా పలాష్ ఎవరు కూడా పెళ్లి వాయిదా, తేదీ మార్పు, లేదా రద్దు గురించి ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో అసలు నిజం బయటకు రావడానికి ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు.
తాజాగా స్మృతి IPL మహిళల జట్టుతో ప్రాక్టీస్లో బిజీగా ఉండగా, పలాష్ తన కొత్త మ్యూజిక్ ఆల్బమ్ పనుల్లో తలమునకలై ఉన్నారు. వారి కెరీర్ ప్రెషర్ వల్లనే పెళ్లి ప్రణాళికలలో మార్పులు వచ్చి ఉండొచ్చని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రస్తుతానికి చూస్తే, ఇన్స్టా బయోలో ఇద్దరూ ఒకే ‘నజర్’ ఎమోజీ పెట్టడం ద్వారా అభిమానులకు సైలెంట్ మెసేజ్ ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.