Weather: ఆంధ్రప్రదేశ్లో వర్ష సూచనలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక!
Weather: ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. రాయలసీమ, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు.. జాగ్రత్తలు పాటించాలని సూచన..
రాయలసీమపై ఆవర్తనం ప్రభావం.. ఏపీలో వర్షాలకు అవకాశం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. రాయలసీమ, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణం ఏర్పడి, పలుచోట్ల చెదురుమదురు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోమవారం (జూన్ 22) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మిగతా జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
చెట్ల కింద నిలబడకూడదు, భారీ హోర్డింగ్స్ దగ్గర ఉండకూడదు, గాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలి. వర్షపు సమయంలో బయటకు వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అప్రమత్తంగా వ్యవహరించాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.
Tags
Be the first to react