LIVE
Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!  •  New Airports: రూ.8,000 కోట్ల భారీ ప్రణాళిక... తొమ్మిది కొత్త విమానాశ్రయాలకు మాస్టర్ ప్లాన్!  •  Health Tips: కడుపు ఉబ్బరాన్ని నిర్లక్ష్యం చేయకండి... అది ఆ సమస్య కూడా కావచ్చు!  •  New Phone Realme: మొబైల్ ప్రియులకు రియల్‌మీ బంపర్ ఆఫర్.. బడ్జెట్‌ ధరలోనే 3 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఫోన్!  •  Amaravathi: అమరావతికి కేంద్ర కేబినెట్ భారీ మద్దతు.. రాజధాని అభివృద్ధికి కీలక ప్రాజెక్టులకు ఆమోదం!  •  H1B visa: మోసపూరిత మార్గాల్లో పౌరసత్వం.. భారత సంతతి వ్యాపారవేత్తపై అమెరికా కొరడా.. ఎవరీ నీరజ్ శర్మ?  •  Air Asia: విమాన ఆలస్యం.. రైతుకు రూ.90,750 చెల్లించాలని ఎయిర్ ఏషియాకు ఆదేశం!  •  Road Accident: దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం!  •  OTT: 'దృశ్యం 3' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... ఆ ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లోనే... ఎప్పుడంటే?  •  Chandrababu: త్వరలోనే 'మన మిత్ర' మొబైల్ యాప్... చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Andhra Pradesh

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం!

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఉచిత సర్వదర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.

AndhraPravasi News Desk 1 min read
Tirumala 22
Tirumala 22

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. కంపార్ట్మెంట్లు నిండిపోయిన వైనం..

తిరుమలలో భారీ రద్దీ.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,812 మంది భక్తులు..

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఉచిత సర్వదర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం క్యూలో చేరే భక్తులకు సుమారు 15 నుంచి 18 గంటల వరకు దర్శన సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం వచ్చే భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటలలోపు స్వామివారి దర్శనం కలుగుతోంది.

మరోవైపు నిన్న స్వామివారిని మొత్తం 83,812 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ 38,345 మంది తలనీలాలు సమర్పించారు.

శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా నమోదైంది. నిన్న ఒక్కరోజే భక్తులు హుండీ ద్వారా రూ.4.31 కోట్ల ఆదాయాన్ని సమర్పించారు. అదేవిధంగా తిరుమలలో నిన్న 4.02 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు.

భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా నిన్న 2.70 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో వైద్య సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచగా, నిన్న 3,732 మంది భక్తులు వైద్య చికిత్స పొందారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు దర్శనం, వసతి, ప్రసాదాల పంపిణీ వంటి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Be the first to react

More Coverage

Amaravathi: అమరావతికి కేంద్ర కేబినెట్ భారీ మద్దతు.. రాజధాని అభివృద్ధికి కీలక ప్రాజెక్టులకు ఆమోదం!

Amaravathi: అమరావతికి కేంద్ర కేబినెట్ భారీ మద్దతు.. రాజధాని అభివృద్ధికి కీలక ప్రాజెక్టులకు ఆమోదం!

Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అమర…

Pawan Kalyan: భారతీరాజా మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ ట్వీట్.. భారతీయ సినిమాకు తీరని లోటంటూ ఆవేదన!

Pawan Kalyan: భారతీరాజా మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ ట్వీట్.. భారతీయ సినిమాకు తీరని లోటంటూ ఆవేదన!

భారతీయ చలనచిత్ర రంగంలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. తన అద్భుతమైన సృజనాత్మకతతో వెండితెరపై సరికొత్త ఒరవ…

Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై కఠిన చర్యలు.. ఆంధ్ర పేపర్, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు!

Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై కఠిన చర్యలు.. ఆంధ్ర పేపర్, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు!

Pawan Kalyan: గోదావరి నది కాలుష్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాజమహేంద్రవరం నగర…