Flights for AP Students: విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం! Tamil Nadu Politics: తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు! Kavitha Maji: బెంగాల్ బీజేపీలో కొత్త చరిత్ర.. ఇళ్లలో పనిచేసే మహిళకు పట్టం కట్టిన ఓటర్లు! Union Government: ఏపీలో పేదలకు తీపికబురు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి రూ.2.39 లక్షలు! అర్హులు వీరే... Bullet Train: పట్టాలెక్కనున్న బుల్లెట్ రైళ్లు... 3 గంటల్లో హైదరాబాద్ టు బెంగళూరు! Promotions: సచివాలయ ఉద్యోగులకు హైకోర్టు తీపి కబురు: ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై కీలక ఉత్తర్వులు! Express Highway: అమరావతికి రాజమార్గం! బెంగళూరు, చెన్నై నగరాలకు చేరువగా... 92 కిమీ ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్ సిగ్నల్! Balakrishna: సినిమా గ్లామర్ కాదు.. ప్రజాబలం! బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. Vijay: చారిత్రక విజయం.. కరూర్ మృతులకు అంకితం.. టీవీకే పార్టీ సంచలన ప్రకటన.. Prajavedhika: మంగళగిరి ప్రజా గ్రీవెన్స్ లో పోటెత్తిన బాధితులు: వైసీపీ అరాచకాలపై వెల్లువెత్తిన అర్జీలు! Flights for AP Students: విద్యార్థుల కలను నిజం చేసిన ఎమ్మెల్యే సౌమ్య.. సొంత ఖర్చులతో విమానయానం! Tamil Nadu Politics: తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు! Kavitha Maji: బెంగాల్ బీజేపీలో కొత్త చరిత్ర.. ఇళ్లలో పనిచేసే మహిళకు పట్టం కట్టిన ఓటర్లు! Union Government: ఏపీలో పేదలకు తీపికబురు.. ఒక్కొక్కరి అకౌంట్‌లోకి రూ.2.39 లక్షలు! అర్హులు వీరే... Bullet Train: పట్టాలెక్కనున్న బుల్లెట్ రైళ్లు... 3 గంటల్లో హైదరాబాద్ టు బెంగళూరు! Promotions: సచివాలయ ఉద్యోగులకు హైకోర్టు తీపి కబురు: ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై కీలక ఉత్తర్వులు! Express Highway: అమరావతికి రాజమార్గం! బెంగళూరు, చెన్నై నగరాలకు చేరువగా... 92 కిమీ ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్ సిగ్నల్! Balakrishna: సినిమా గ్లామర్ కాదు.. ప్రజాబలం! బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. Vijay: చారిత్రక విజయం.. కరూర్ మృతులకు అంకితం.. టీవీకే పార్టీ సంచలన ప్రకటన.. Prajavedhika: మంగళగిరి ప్రజా గ్రీవెన్స్ లో పోటెత్తిన బాధితులు: వైసీపీ అరాచకాలపై వెల్లువెత్తిన అర్జీలు!

Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల స్వర్ణయుగం.. శ్రీసిటీలో క్యారియర్ ఏసీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం మరింత వేగం పడుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో దేశ, విదేశాల ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి.

Published : 2026-05-05 12:09:00

రూ.1000 కోట్ల పెట్టుబడి.. వేలాది ఉద్యోగాలు..

ఆధునిక సాంకేతికతతో స్మార్ట్ తయారీ యూనిట్..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం మరింత వేగం పడుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో దేశ, విదేశాల ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ కారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఏపీలో భారీ పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.

ఈ నూతన ప్రాజెక్టుకు రేపు శ్రీసిటీలో శంకుస్థాపన జరగనుంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెట్టుబడుల స్వర్ణయుగం నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. గత 22 నెలల్లోనే సుమారు 800 ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడం పరిశ్రమల పెరుగుదలకు నిదర్శనంగా నిలిచింది.

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన కొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు మూడు దశల్లో 2028 నాటికి పూర్తికానుండగా, దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 3వేల మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

దేశంలో పెరుగుతున్న HVAC (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్) ఉత్పత్తుల డిమాండ్‌ను తీర్చేందుకు ఈ ప్లాంట్ కీలకంగా మారనుంది. అత్యాధునిక మౌలిక వసతులు, ఆధునిక యంత్రాలు (P&M)తో ఈ యూనిట్ నిర్మించబడుతుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సమన్వయం, ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

దేశంలో ఇప్పటికే ఐదు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్యారియర్ సంస్థకు హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో తయారీ యూనిట్, హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి మరింత గౌరవం తెస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగంలో మరో పెద్ద అడుగు ముందుకేసింది. పెట్టుబడులు, ఉద్యోగాలు, సాంకేతిక అభివృద్ధి—అన్నీ కలిసి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి.

Spotlight

Read More →