Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

Flyover: రూ.300 కోట్లతో భారీ ప్రాజెక్టు..! మూడో వంతెనతో మారనున్న నగర రూపం!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్లు, ఫ్లై ఓవర

2026-01-20 16:04:00
దావోస్‍లో చంద్రబాబు 'గ్రోత్ స్టోరీ'.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్.. పెట్టుబడులకు స్వర్గధామం నవ్యాంధ్ర!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలు, బైపాస్ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో కాకినాడ నగరంలో తీవ్రంగా మారిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఉప్పుటేరుపై మూడో వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏటిమొగ వద్ద ఉప్పుటేరుపై వంతెన, బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన జరిగినప్పటికీ, ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు చర్యలు చేపట్టింది.

Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు!

స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి కాకినాడ ట్రాఫిక్ సమస్య తీవ్రతను వివరించడంతో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ నిధుల మార్గాలను అన్వేషించిన ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు బాధ్యతలను జాతీయ రహదారుల విభాగానికి అప్పగించాలని నిర్ణయించింది. ఉప్పుటేరుపై మూడో వంతెనతో పాటు సుమారు 3 కిలోమీటర్ల పొడవైన బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.300 కోట్ల అంచనాతో డీపీఆర్ రూపొందించారు. ఈ డీపీఆర్‌ను జాతీయ రహదారుల విభాగానికి సమర్పించగా, వారు ఇప్పటికే ఒక కన్సల్టెన్సీని నియమించి సాంకేతిక అధ్యయనం ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తయితే కాకినాడ నగరానికి ఇది గేమ్ చేంజర్‌గా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

చికెన్ స్కిన్‌తో తింటే మంచిదా? కాదా? ఆరోగ్యం మరియు రుచి వెనుక అసలు నిజాలు ఇవే! తినేముందు తప్పక తెలుసుకోండి..

ప్రస్తుతం విశాఖపట్నం, అమలాపురం, రావులపాలెం వంటి ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలు కాకినాడ నగరంలోంచే ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులపై రోజూ తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ప్రజలు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు, కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం నుంచి చొల్లంగి వరకు 216 జాతీయ రహదారిలో భాగంగా 18.4 కిలోమీటర్ల పొడవైన బైపాస్ రోడ్డును గతంలో ప్రారంభించారు. అయితే, ఈ ప్రాజెక్టు మొదలై దశాబ్దం గడిచినా ఇంకా పూర్తి కాకపోవడం గమనార్హం. దీనివల్ల ఆశించిన ఫలితం రాలేదు.

రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు

ఇప్పుడు ఈ బైపాస్‌కు తోడుగా మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాకినాడ పోర్టు నుంచి ఉప్పుటేరు మీదుగా కొత్త వంతెన నిర్మించి, అక్కడి నుంచి చొల్లంగి వద్ద 216 జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ రెండు బైపాస్‌లు పూర్తయితే, భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి, నగరవాసులకు ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారి నిర్మాణం ఇప్పటికే చివరి దశకు చేరుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్టు కూడా వేగంగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Banking News: ఎస్‌బీఐ కొత్త రూల్స్ అమలు.. లావాదేవీలపై పెరిగిన ఛార్జీలు..!!
హోండా యాక్టివా 7G.. పెరిగిన మైలేజీ, కొత్త టెక్నాలజీ – మధ్యతరగతి కుటుంబాలకు మళ్ళీ పండగే!
ఓటీటీలో 'దండోరా' మోత.. ఎన్టీఆర్ ఒక్క ట్వీట్‌తో సీన్ మారిపోయింది.. టాప్-2లో ట్రెండింగ్!
AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..!
Health News: గర్భిణుల భయాలకు బ్రేక్.. పారాసిటమాల్‌పై లాన్సెట్ అధ్యయనంతో క్లారిటీ..!!
విశాఖ, కాకినాడ పోర్టులకు 'గ్రీన్' కళ.. హైడ్రోజన్ వాహనాలపై మంత్రి లోకేశ్ భారీ ప్లాన్!

Spotlight

Read More →