Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్!

Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష!

Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన పనులను మళ్ళీ ప్రారంభించామని, నాణ్యతతో కూడిన ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Published : 2026-04-11 16:08:00

పేదల సొంతింటి కలపై మంత్రి భరోసా.. త్వరలోనే టిడ్కో గృహ ప్రవేశాలు.

వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్ల విధ్వంసం.. కూటమి పాలనలో పునర్నిర్మాణం..

ఇళ్ల నిర్మాణంలో రాజీ వద్దు.. అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వార్నింగ్…

Gottipati RaviKumar in Addanki: రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేడు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అద్దంకి సమీపంలో గతంలో ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన టిడ్కో (TIDCO) గృహ సముదాయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, లబ్ధిదారులకు గృహాలను త్వరితగతిన అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు, నిర్మాణాల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గట్టిగా సూచించారు.

టిడ్కో ఇళ్లపై గత ప్రభుత్వ తీరును మంత్రి ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అద్దంకి పరిధిలో 15 ఎకరాల విస్తీర్ణంలో 960 మంది పేదల కోసం ఈ ఇళ్లను మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఈ నిర్మాణాలను పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆరోపించారు. దీనివల్ల ఐదేళ్ల పాటు పేదలకు ఇళ్ల కల నెరవేరలేదని, సగంలో ఆగిపోయిన భవనాలు కూడా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో ఈ పనులను మళ్ళీ ప్రారంభించామని వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న భవనాలను పునరుద్ధరిస్తున్నామని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేవలం భవన నిర్మాణమే కాకుండా, త్వరలోనే ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్, మంచినీటి సరఫరా వంటి కనీస మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన, సింగరకొండ ప్రాంతంలో మినీ బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల ఇళ్లు కోల్పోయిన 80 మంది నిర్వాసితులకు కూడా ఊరటనిచ్చారు. వారికి రెండు సెంట్ల స్థలంలో పక్కా గృహాలను నిర్మించి ఇస్తామని కీలక ప్రకటన చేశారు.

ప్రభుత్వ లక్ష్యం పేదల సంక్షేమమేనని, గతంలో జరిగిన జాప్యాన్ని అధిగమించి గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తామని మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. టిడ్కో గృహ సముదాయాల వద్ద నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులను హెచ్చరించారు. మంత్రి పర్యటనతో అద్దంకి నియోజకవర్గంలోని టిడ్కో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు చిగురించాయి. త్వరలోనే తమకు ఇళ్ల తాళాలు అందుతాయన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →