Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ!

2026-01-02 10:31:00
Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు....

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి కేంద్రంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి కోసం భూసమీకరణ చేపట్టి ఇప్పటికే 11 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, భూములు ఇచ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన సాంకేతిక ఇబ్బందులు, న్యాయపరమైన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది.

Greenfield Expressway: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గిఫ్ట్... కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే!

రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు ఇప్పటివరకు సీఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల పట్టాలు పెద్ద సమస్యగా మారాయి. ఆ పట్టాల్లో “అసైన్డ్” అనే పదం ఉండటాన్ని ఆసరాగా చేసుకుని దళారులు రైతులను మోసం చేశారు. భూముల విలువ గజానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తక్కువగా చూపించి కొనుగోళ్లు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ అంశంపై రైతులు పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయగా, ఇప్పుడు వారి ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది.

Land Pattas Distribution: ఏపీలో వారందరికీ సంక్రాంతి కానుక! ఇంటి పట్టాలు పంపిణీ... రెడీ గా ఉండండి!

అమరావతి కోసం మొత్తం 3,139 మంది అసైన్డ్ రైతులు సుమారు 2,689.14 ఎకరాల భూమిని ఇచ్చారు. వీరికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల పట్టాల్లో ఉన్న “అసైన్డ్” పదం కారణంగా యాజమాన్య హక్కులపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో బ్యాంకు రుణాలు, అమ్మకాలు, లావాదేవీలు అన్నీ సమస్యాత్మకంగా మారాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కౌలు బకాయిలు, సీఐడీ కేసుల వంటి అంశాలను పరిష్కరించిన ప్రభుత్వం ఇప్పుడు పట్టాల విషయంలోనూ స్పష్టత తీసుకొచ్చింది.

Ballari Hightension: బళ్లారిలో హై టెన్షన్... MLA ఇంటిపై కాల్పులు! ఒకరు మృతి!

ఈ నేపథ్యంలో పురపాలక శాఖ గత ఏడాది అక్టోబర్‌లో జీవో నంబర్ 187ను జారీ చేసింది. భూసమీకరణ చట్టంలో మార్పులు చేసి, రిటర్నబుల్ ప్లాట్లకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ఈ జీవోలో సూచించింది. అయితే ఈ జీవో కొత్తగా ఇచ్చే పట్టాలకే వర్తిస్తుందని సీఆర్డీఏ స్పష్టం చేయడంతో అప్పటికే పట్టాలు పొందిన రైతుల్లో గందరగోళం నెలకొంది. దాదాపు 95 శాతం మంది రైతులు మరోసారి ప్రభుత్వాన్ని సంప్రదించి, తమ సమస్యకు కూడా అదే పరిష్కారం వర్తింపజేయాలని కోరారు.

Liquor: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నోట్ల వర్షం..! తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి మద్యం విక్రయాలు..!

రైతుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం చివరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇచ్చిన పాత రిటర్నబుల్ ప్లాట్ల పట్టాల స్థానంలో, “అసైన్డ్” పదం తొలగించి కొత్త పట్టాలు జారీ చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. దీనికోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు కొత్త ఏడాదిలో కొత్త పట్టాలు అందించనుంది. దీంతో దళారుల మోసాలకు చెక్ పడటంతో పాటు, రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు లభించనున్నాయి. అమరావతి భూసమీకరణలో భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు ఇది నిజంగా పెద్ద ఊరటగా మారింది.

Holidays: ఏపీలో విద్యార్థులకు పండగే పండగ..! జనవరిలో ఏకంగా 13 సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే!
Farmers: రైతులకు తీపి కబురు! సంక్రాంతి కంటే ముందే ఖాతాల్లో నిధులు జమ..!!
H1B Visa: హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ శుభవార్త! భారత్‌లోనే పని చేసే అవకాశం!
US Visa Update: గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై కఠిన ఆంక్షలు..! ఇక కేవలం పెళ్లి చేసుకుంటే సరిపోదు..!
Leopard Alert: భక్తులకు అలర్ట్! చిరుత కలకలం... జాగ్రత్త!

Spotlight

Read More →