అమెరికాకు అజిత్ దోవల్ వార్నింగ్..! భారత్‌ను బెదిరిస్తే ఊరుకునేది లేదు! AP Health Dept: రక్తహీనత బాధితులకు ఊరట.. బాలింతలతో పాటు గర్భిణీలకు ఎఫ్‌సీఎం పంపిణీ.!! రాష్ట్రంలో మరో మెగా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..! వేల కోట్ల నిధులతో.. మారనున్న రూపురేఖలు! Jammu Kashmir News: మరోసారి నోరు పారేసుకున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్! రైతుల ఖాతాల్లోకి రూ.9,300 కోట్లు! 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్న కూటమి ప్రభుత్వం! Land Passbooks Distribution: భూమి-మీ హక్కు'తో రైతులకు భరోసా.. కర్నూలు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి పర్యటన.!! Navy Events: వైజాగ్‌లో యుద్ధ నౌకల సందడి.. సీఎం ఆదేశాలతో వీఎంఆర్డీఏ భారీ ఏర్పాట్లు.!! AP Labour Schemes: భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్... పెళ్లికానుక, ప్రసూతి సాయం పథకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఇక వాటిపై జీఎస్టీ ఉండదు...! సీఎం చంద్రబాబు హామీ! ఏపీ ప్రజలకు తీపికబురు..! భారీగా తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు! అమెరికాకు అజిత్ దోవల్ వార్నింగ్..! భారత్‌ను బెదిరిస్తే ఊరుకునేది లేదు! AP Health Dept: రక్తహీనత బాధితులకు ఊరట.. బాలింతలతో పాటు గర్భిణీలకు ఎఫ్‌సీఎం పంపిణీ.!! రాష్ట్రంలో మరో మెగా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..! వేల కోట్ల నిధులతో.. మారనున్న రూపురేఖలు! Jammu Kashmir News: మరోసారి నోరు పారేసుకున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్! రైతుల ఖాతాల్లోకి రూ.9,300 కోట్లు! 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్న కూటమి ప్రభుత్వం! Land Passbooks Distribution: భూమి-మీ హక్కు'తో రైతులకు భరోసా.. కర్నూలు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి పర్యటన.!! Navy Events: వైజాగ్‌లో యుద్ధ నౌకల సందడి.. సీఎం ఆదేశాలతో వీఎంఆర్డీఏ భారీ ఏర్పాట్లు.!! AP Labour Schemes: భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్... పెళ్లికానుక, ప్రసూతి సాయం పథకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఇక వాటిపై జీఎస్టీ ఉండదు...! సీఎం చంద్రబాబు హామీ! ఏపీ ప్రజలకు తీపికబురు..! భారీగా తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు!

Land Passbooks Distribution: భూమి-మీ హక్కు'తో రైతులకు భరోసా.. కర్నూలు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి పర్యటన.!!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కలుగట్ల గ్రామంలో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు.

Published : 2026-02-06 08:10:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మీ భూమి-మీ హక్కు కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని కలుగట్ల గ్రామంలో నేడు నిర్వహించనున్న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు వారి భూములపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులను కల్పిస్తూ, పారదర్శకమైన రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఇలా..

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు (శుక్రవారం) ఉదయం అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరుతారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆయన ఎమ్మిగనూరు మండలం కలుగట్ల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని, ఎంపిక చేసిన లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రెవెన్యూ సంస్కరణలు మరియు రైతుల సంక్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఈ వేదికగా ఆయన వివరించే అవకాశం ఉంది.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. స్థానిక వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, సాగు పద్ధతులపై రైతులతో నేరుగా ముఖాముఖి చర్చించనున్నారు. రైతుల సమస్యలు, సాగునీటి లభ్యత మరియు ప్రభుత్వ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. పర్యటన చివరగా కలుగట్లలోనే పార్టీ శ్రేణులతో సమావేశమై, స్థానిక రాజకీయ పరిస్థితులపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు తిరిగి అమరావతికి ప్రయాణమవుతారు..

రాష్ట్రవ్యాప్త పంపిణీకి శ్రీకారం

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున మొత్తం 279 గ్రామాలను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 1,16,870 డ్రాఫ్ట్ పాస్‌బుక్స్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో అత్యంత కీలకంగా భావించే e-KYC ప్రక్రియను ఇప్పటికే 91,038 పుస్తకాలకు పూర్తి చేశారు. సాంకేతిక లోపాలు లేకుండా, అర్హులైన ప్రతి రైతుకు పాసుపుస్తకం అందేలా జిల్లా యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది.

కర్నూలు జిల్లా విషయానికి వస్తే మొత్తం 13 గ్రామాల్లోని 8,347 మంది రైతులకు కొత్త పాసుపుస్తకాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి పర్యటిస్తున్న కలుగట్ల గ్రామంలోనే ఈ ఒకే రోజు 1,178 మంది రైతులకు యాజమాన్య పత్రాలు అందనున్నాయి. గతంలో భూ వివాదాలు, తప్పుల తడకగా ఉన్న రికార్డుల వల్ల ఇబ్బందులు పడ్డ రైతులకు ఈ కొత్త పాసుపుస్తకాలు పెద్ద ఊరటనివ్వనున్నాయి.

రెవెన్యూ వ్యవస్థలో నవశకం

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మిగనూరు ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమం ద్వారా భూ రికార్డులను ప్రక్షాళన చేసి, రైతులకు భరోసా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. కలుగట్ల గ్రామసభ ద్వారా రాష్ట్రవ్యాప్త రైతులకు ప్రభుత్వం ఒక బలమైన సందేశాన్ని పంపనుంది. భూముల రీ-సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమిస్తూ, అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఈ పాసుపుస్తకాలు భవిష్యత్తులో భూ క్రయవిక్రయాల్లో పారదర్శకతను పెంచుతాయని అధికారులు భావిస్తున్నారు.

జిల్లా కలెక్టర్ మరియు పోలీసు యంత్రాంగం ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైతులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

Spotlight

Read More →