అమెరికాకు అజిత్ దోవల్ వార్నింగ్..! భారత్‌ను బెదిరిస్తే ఊరుకునేది లేదు! AP Health Dept: రక్తహీనత బాధితులకు ఊరట.. బాలింతలతో పాటు గర్భిణీలకు ఎఫ్‌సీఎం పంపిణీ.!! రాష్ట్రంలో మరో మెగా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..! వేల కోట్ల నిధులతో.. మారనున్న రూపురేఖలు! Jammu Kashmir News: మరోసారి నోరు పారేసుకున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్! రైతుల ఖాతాల్లోకి రూ.9,300 కోట్లు! 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్న కూటమి ప్రభుత్వం! Land Passbooks Distribution: భూమి-మీ హక్కు'తో రైతులకు భరోసా.. కర్నూలు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి పర్యటన.!! Navy Events: వైజాగ్‌లో యుద్ధ నౌకల సందడి.. సీఎం ఆదేశాలతో వీఎంఆర్డీఏ భారీ ఏర్పాట్లు.!! AP Labour Schemes: భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్... పెళ్లికానుక, ప్రసూతి సాయం పథకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఇక వాటిపై జీఎస్టీ ఉండదు...! సీఎం చంద్రబాబు హామీ! ఏపీ ప్రజలకు తీపికబురు..! భారీగా తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు! అమెరికాకు అజిత్ దోవల్ వార్నింగ్..! భారత్‌ను బెదిరిస్తే ఊరుకునేది లేదు! AP Health Dept: రక్తహీనత బాధితులకు ఊరట.. బాలింతలతో పాటు గర్భిణీలకు ఎఫ్‌సీఎం పంపిణీ.!! రాష్ట్రంలో మరో మెగా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..! వేల కోట్ల నిధులతో.. మారనున్న రూపురేఖలు! Jammu Kashmir News: మరోసారి నోరు పారేసుకున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్! రైతుల ఖాతాల్లోకి రూ.9,300 కోట్లు! 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్న కూటమి ప్రభుత్వం! Land Passbooks Distribution: భూమి-మీ హక్కు'తో రైతులకు భరోసా.. కర్నూలు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి పర్యటన.!! Navy Events: వైజాగ్‌లో యుద్ధ నౌకల సందడి.. సీఎం ఆదేశాలతో వీఎంఆర్డీఏ భారీ ఏర్పాట్లు.!! AP Labour Schemes: భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్... పెళ్లికానుక, ప్రసూతి సాయం పథకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్! ఏపీలో ఇక వాటిపై జీఎస్టీ ఉండదు...! సీఎం చంద్రబాబు హామీ! ఏపీ ప్రజలకు తీపికబురు..! భారీగా తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు!

AP Labour Schemes: భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్... పెళ్లికానుక, ప్రసూతి సాయం పథకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

ఏపీ కార్మికులకు గుడ్ న్యూస్... భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తూ సీఎం చంద్రబాబు ఆదేశాలు. 20 లక్షల మందికి ఆధునిక నైపుణ్య శిక్షణ మరియు ఆరోగ్య భరోసా.

Published : 2026-02-06 07:45:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గతంలో అమలైన సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో కార్మిక శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులు, గిగ్ వర్కర్లు మరియు ఇతర అసంఘటిత రంగ కార్మికుల ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

సంక్షేమ పథకాల రీ-ఎంట్రీ

గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన కార్మిక సంక్షేమ పథకాలకు మళ్లీ జీవం పోయాలని సీఎం స్పష్టం చేశారు.

 ప్రసూతి సాయం: రూ. 20,000

 వివాహ కానుక: రూ. 40,000

 సహజ మరణం సంభవిస్తే: రూ. 60,000

అంత్యక్రియల ఖర్చులు: రూ. 20,000

ఈ మొత్తాలను నేరుగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలుగుదేశం హయాంలోనే ఏర్పాటు చేసిన 'కన్‌స్ట్రక్షన్ వర్కర్ వెల్ఫేర్ ఫండ్' ప్రాధాన్యతను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ

రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులను 'స్కిల్డ్ లేబర్'గా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు ప్రకటించారు. ఎల్ అండ్ టీ (L&T), ఎన్సీసీ (NCC), మిట్టల్ వంటి దిగ్గజ నిర్మాణ సంస్థల సహకారంతో కార్మికులకు ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. సిమ్యులేషన్ ల్యాబ్స్ ద్వారా శిక్షణ పొందిన కార్మికులు కేవలం రాష్ట్రంలోనే కాకుండా, దేశ విదేశాల్లోనూ భారీ ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్మికులు కేవలం కూలీలుగానే మిగిలిపోకుండా, 'మైక్రో ఎంట్రప్రెన్యూర్లు'గా ఎదిగేలా ప్రోత్సహించాలని  సీఎం ఆకాంక్షించారు.

డిజిటల్ డేటా బేస్ - లేటరల్ ఎంట్రీ

జిల్లాల వారీగా వృత్తుల వారీగా కార్మికుల పూర్తి సమాచారంతో కూడిన డేటా బేస్ రూపొందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. దీనిని 'నైపుణ్యం పోర్టల్'తో అనుసంధానించడం ద్వారా వారికి తగిన పని దొరుకుతుందని వివరించారు. చదువు మధ్యలో ఆపేసిన కార్మికులు 'లేటరల్ ఎంట్రీ' ద్వారా వివిధ కోర్సులు పూర్తి చేసి ఉన్నత విద్యార్హతలు పొందేలా వెసులుబాటు కల్పించాలని అధికారులను కోరారు.

 కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం సూచించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగంగా కార్మికులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, 'సంజీవని' ద్వారా స్క్రీనింగ్ చేయాలని ఆదేశించారు. కార్మిక శాఖ ద్వారా రూ. 2.5 లక్షల వరకు చికిత్స అందించి, ఆపై ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా భరించేలా సమన్వయం చేసుకోవాలని చెప్పారు.

ఈ సమీక్షా సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కార్యదర్శి శేషగిరి బాబు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలను జారీ చేశారు

Spotlight

Read More →