Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు! AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి! Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత! విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే! అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం.. 921 ప్లాట్లపై చర్చ - 15 రోజుల్లో.. Political News: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట.. ఫైబర్‌నెట్ కేసు కొట్టివేసిన కోర్టు.. నిజమే గెలిచింది! Kavithas comments: సీఎం అవుతా.. అన్నింటిపై విచారణ జరిపిస్తా.. కవిత సంచలన వ్యాఖ్యలు! Trumps warning War :వెనిజులాపై దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం! AP Govt: ఆ విద్యార్థులకు భారీ ఊరట..! సబ్జెక్ట్ మినహాయింపుతో అడ్మిషన్ ఛాన్స్…! Student Kits: ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త! రూ.830 కోట్ల కిట్లు విడుదల.. Aadhaar Update: ఇక ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు…! ఇంటికే UIDAI సేవలు! AP Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త! జనవరి నుంచే మొదలు.. రెడీగా ఉండండి!

Andhra Pradesh News: కాగ్నిజెంట్ భూమిపూజ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి చూపుతున్నాయి... సీఎం చంద్రబాబు!!

2025-12-12 15:31:00
Vizag Investment: విశాఖలో నాన్ రెల్ టెక్నాలజీస్ యూనిట్‌కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ — రూ.50.60 కోట్ల పెట్టుబడి, 567 ఉద్యోగాలు..!!

విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో కాగ్నిజెంట్ సంస్థ కొత్త యూనిట్ భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేడుకలో మాట్లాడుతూ ఒకే పిలుపుతో విశాఖ నుంచి 4,500 మంది నైపుణ్యున్నత యువత కాగ్నిజెంట్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం తనకు ఆనందంగా ఉందని అన్నారు. విశాఖపట్నం వంటి నగరానికి దేశంలో సాటి లేదని, మూడు దశాబ్దాల క్రితమే ఈ నగరం నాలెడ్జి ఎకానమీకి వెన్నెముక అవుతుందని చెప్పానని చంద్రబాబు గుర్తుచేశారు.

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 77వ రోజు ప్రజాదర్బార్! సమస్యల పరిష్కారానికి..

ఇప్పుడేమో విశాఖ ఏఐ హబ్‌గా మారే దిశలో వేగంగా అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. ఈరోజు ఎనిమిది కంపెనీలకు భూమి పూజ చేసినట్లు చెప్పిన సీఎం, రాబోయే నెలల్లో మరిన్ని ఐటీ–టెక్ పెట్టుబడులు విశాఖకు వస్తాయని ధైర్యంగా చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఆగస్టుకే సిద్ధమవుతోందని, మెట్రో రైల్ ప్రాజెక్ట్ కూడా ముందుకు కదులుతోందని తెలిపారు. విశాఖ అభివృద్ధి దిశగా ఇది భారీ మైలురాళ్లు అవుతాయని ఆయన అన్నారు.

విశాఖలో ఏసీఎన్ ఇన్ఫోటెక్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన! విశాఖ యూనిట్ ద్వారా..

విశాఖలో జీవన వ్యయం దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే సుమారు 20 శాతం తక్కువగా ఉందని చంద్రబాబు వివరించారు. ఈ అంశమే ఇక్కడి అభివృద్ధికి అత్యంత అనుకూల వాతావరణాన్ని అందిస్తోందని చెప్పారు. నగరాన్ని నెట్ జీరో కాలుష్య రహిత స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృఢమైన ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. డేటా సెంటర్లు విశాఖకు రావడానికి గ్రీన్ ఎనర్జీ అందుబాటు ప్రధాన కారణమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రూపాయి 99 పైసలకు భూమి కేటాయించే విధానం కంపెనీలకు ఎంతో ప్రయోజనకరమని, దీనివల్ల అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.

India Airports: శీతాకాలం పొగమంచు సీజన్‌కు ముందస్తు సమీక్ష... విమాన రవాణాలో భద్రతా చర్యలను కఠినతరం చేసిన మంత్రి రామ్ మోహన్ నాయుడు!!

గూగుల్ రూ.15 బిలియన్లతో విశాఖలో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోందని, టీసీఎస్ కూడా పెద్ద విస్తరణ ప్రణాళికలతో వస్తోందని సీఎం వెల్లడించారు. ప్రపంచ టెక్ దిగ్గజాలను నడిపిస్తున్న సీఈఓలలో చాలా మంది భారతీయులే కాకుండా తెలుగువారే ఉండటం గర్వకారణమని అన్నారు. శ్రీహరికోట సమీపంలో సాటిలైట్ సిటీ నిర్మాణం కొనసాగుతోందని, ఇది భవిష్యత్ అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రియల్ టైమ్ క్లియరెన్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పెట్టుబడిదారులు ఇక ఇంటికే సిద్ధంగా ఉండి ప్రాజెక్టులు ప్రారంభించగలిగేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.

Techs new campus: విశాఖ మధురవాడలో టెక్ తమ్మిన కొత్త క్యాంపస్.. రూ.62 కోట్ల పెట్టుబడికి శ్రీకారం!

ప్రతి ఒక్కరూ ఏఐను వినియోగించాలి ఆరోగ్య రంగంలో కూడా AI ఆధారిత సేవలను తీసుకువస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు భారత్‌పై, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. దేశం అభివృద్ధి పథంలో నిలబడటానికి సరైన సమయం, సరైన ప్రదేశం, సరైన నాయకత్వం కలిసొచ్చిన సందర్భం ఇదేనని, ప్రధాని మోదీ ఈ మార్పుకు నాయకత్వం వహిస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

హ్యాపీ బర్త్ డే తలైవా.. సూపర్ స్టార్‌కు వెల్లువెత్తుతున్న విషెస్.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు!

కాగ్నిజెంట్ సంస్థ భవిష్యత్తులో లక్ష ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు సాగాలని కోరుతూ, విశాఖను ప్రపంచ ఐటీ మ్యాప్‌లో మరింత బలంగా నిలబెట్టాలనే సంకల్పాన్ని సీఎం వ్యక్తం చేశారు.

Tech Event: సత్య నాదెళ్ల సందేశం.. కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని కొత్త దిశల్లోకి తీసుకెళ్తోంది!!
OTT: క్రైమ్ థ్రిల్లర్ నుంచి పీరియాడికల్ డ్రామా వరకు.. OTTలో కొత్త ఎంటర్టైన్‌మెంట్!
Sweet potatoes: చిలగడదుంపలలో ఆరోగ్య రహస్యాలు.. శీతాకాలంలో తప్పనిసరి ఆహారం!
ఇండిగోకు భారీ షాక్.. విమానాల రద్దుతో ఇబ్బందులు, మరోవైపు రూ. 58.75 కోట్ల జరిమానా భారం.!
US Visa Rules: అమెరికా వీసా కావాలా? అయితే ప్రెగ్నెంట్ కాదని నిరూపించుకోవాల్సిందే!
Gurukul admissions: గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరి 22న పరీక్ష!
Srinu Madhuri: పార్టీ వివాదం.. మాకు సంబంధం లేదు.. అంటున్న శ్రీను, మాధురి!
Andhra Pradesh Rural Roads: గ్రామీణ రోడ్ల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్‌కు మంత్రుల కృతజ్ఞతలు.. 26 జిల్లాల్లో 1,299 రోడ్ల పటిష్టతకు ఆమోదం..!!

Spotlight

Read More →