JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే! AP Government: బీసీ హాస్టల్‌లో ఆహార కొరతపై ప్రభుత్వం సీరియస్..! పాత సిబ్బందిని మారుస్తూ ఆదేశాలు! Steel Bridge: నెలాఖరులోగా బకింగ్‌హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ పూర్తి! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Sagar Defence: సముద్రంలో చేపలను పట్టేందుకు AI టెక్నాలజీ..! మత్స్యకారులకు లోకేష్ హామీ! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే! AP Government: బీసీ హాస్టల్‌లో ఆహార కొరతపై ప్రభుత్వం సీరియస్..! పాత సిబ్బందిని మారుస్తూ ఆదేశాలు! Steel Bridge: నెలాఖరులోగా బకింగ్‌హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ పూర్తి! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Sagar Defence: సముద్రంలో చేపలను పట్టేందుకు AI టెక్నాలజీ..! మత్స్యకారులకు లోకేష్ హామీ!

Mega Deals: ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ..! సెమీకండక్టర్లు నుంచి ఈవీ బ్యాటరీల దాకా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తైవాన్ ప్రతినిధి బృందానికి స

Published : 2025-11-13 17:02:00
Cold wave: తెలంగాణలో చలి అలజడి.. రాబోయే 5 రోజుల్లో... ఏపీలో కొత్త అల్పపీడనం!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తైవాన్ ప్రతినిధి బృందానికి స్పష్టం చేశారు. తైవాన్ కంపెనీలు వివిధ రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్‌లో తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి ముమిన్ చెన్ నేతృత్వంలోని బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయింది.
తైవాన్ పెట్టుబడిదారులకు ఏపీ అందించే అవకాశాలను వివరించిన సీఎం, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమల కారిడార్ల అభివృద్ధి వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని కుప్పం, ఓర్వకల్లు, శ్రీకాళహస్తి ప్రాంతాలను ఇండస్ట్రీయల్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

End 43 days: అమెరికాలో 43 రోజుల ప్రభుత్వ షట్‌డౌన్‌కు ముగింపు.. ట్రంప్ సంతకం చేసిన కీలక బిల్లు!

తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, బ్యాటరీ ఉత్పత్తి రంగాల్లో ఏపీతో భాగస్వామ్యం చేయాలని సీఎం ఆహ్వానించారు. అలీజియన్స్ గ్రూప్ రూ.400 కోట్ల పెట్టుబడితో కుప్పంలో ఇండో-తైవాన్ పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ముందుకు వస్తోందని, పౌ చెన్ గ్రూప్ ఫుట్‌వేర్ యూనిట్‌ను కుప్పంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఓర్వకల్లులో క్రియేటివ్ సెన్సార్ ఇంక్ ఇమేజ్ సెన్సార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపగా, ఇ-జౌల్ ఇండియా 2.2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్థ్యంతో అడ్వాన్స్‌డ్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైందని చెప్పారు.

Rani Kamalapati: రైల్వే కాదు, వాణిజ్య కేంద్రం... హోటల్‌ ఆసుపత్రి కార్యాలయాలతో సమగ్ర ప్రాజెక్ట్‌!

ఈ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం సమక్షంలో తైవాన్ కంపెనీలు, ఏపీ ఈడీబీతో ఒప్పందాలపై సంతకాలు చేశారు. తైవాన్ కంపెనీల పారిశ్రామిక పార్కులకు భూములు, రోడ్లు, మౌలిక వసతులు కేటాయించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు. కేంద్రం త్వరలో సెమీకండక్టర్ మిషన్ పాలసీ కింద ప్రోత్సాహకాలను ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. అలాగే తైవాన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న సహకారం అత్యంత సంతృప్తికరమని తైవాన్ ప్రతినిధి బృందం ప్రశంసించింది.

ఫ్రాన్స్‌కి 12 టైమ్‌జోన్లు ఎందుకు? కారణం తెలుసా?

ఇక, విశాఖలో జరిగిన పెట్టుబడి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటలీ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలీతో కూడా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆటోమోటివ్, యంత్రాల తయారీ, ఫ్యాషన్, ఆహార శుద్ధి, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ఏపీలో ఇటాలియన్ ఇండస్ట్రీయల్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ఇద్దరూ అంగీకరించారు. ఇటాలియన్ కంపెనీలు వ్యవసాయ యంత్రాలు, నౌకా నిర్మాణం, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా సీఎం ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణ భారత పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. తైవాన్, ఇటలీ వంటి దేశాలు ఏపీతో భాగస్వామ్యం చేయడం, భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త దశను ప్రారంభించనుంది.
 

Amaravati Updates: రూ.1,863 కోట్ల అభివృద్ధి పనులు.. వెంకటపాలెం, పెనుమాక సహా నాలుగు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ.. CRDA కమిషనర్‌కు కీలక ఆదేశాలు జారీ!
Israyel:ఢిల్లీలో పేలుడు ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని... ఉగ్రదాడులు మనల్ని భయపెట్టలేవు!
Hitman: గ్రౌండ్‌లోనే కాదు ఫ్యాన్స్ హృదయాల్లో కూడా సిక్స్ కొట్టిన రోహిత్... వెడ్డింగ్ జంటకు సర్ప్రైజ్!
నాగార్జునకు క్షమాపణలు చెప్పిన మంత్రి.. అర్ధరాత్రి వేళ సోషల్మీడియాలో పోస్టు!
భాగస్వామ్య సదస్సు కోసం ముస్తాబైన విశాఖ.. 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు.! విందు తర్వాత..
విశాఖలో ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగం!

Spotlight

Read More →