జనసేన కార్యకర్తలు వైకాపా అరాచకాలపై పోరాటం చేయాలని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. సీతంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో 20 ఏళ్లు వైకాపా అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు.
కూటమి ప్రభుత్వం సమన్వయంతో సమర్థంగా పరిపాలిస్తోందని చెప్పారు. చిన్నచిన్న లోపాలు ఉంటే వాటిని సమన్వయ కమిటీ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. “నేను ఉత్తరాంధ్రలోనే ఉంటాను. నెలలో ఐదు నుంచి పది రోజుల పాటు ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తలను కలుస్తాను.
దామాషా ప్రకారం జనసేనకు నామినేటెడ్ పదవులు వస్తాయి. మరి కొద్దిరోజుల్లో జనసేన సభ్యత్వ నమోదు జరుగుతుంది. పెద్ద సంఖ్యలో ప్రజలను పార్టీలో చేర్చాలి”
అని నాగబాబు తెలిపారు .