LIVE
Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  •  Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!  •  AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 85% సబ్సిడీతో ఆ పథకం పునరుద్ధరణ!  •  TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ఘన విజయం!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!  •  Praja Vedika: నేడు (17/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  AP Farmers: రైతులకు డబుల్ ధమాకా.... ఒకే రోజు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల!  •  New Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై మంత్రి కీలక ప్రకటన... త్వరలోనే వారందరికి నెలకు రూ.4వేలు!  • 
⚡ BREAKING
Opinion

Fire Accident: ఘోర అగ్నిప్రమాదం... 18 మంది మృతి!

Fire Accident: దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ హౌజ్ రాణి పరిధిలోని ‘లెమన్ గ్రీన్’ రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో ఈరోజు ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 20 మంది మరణించారు. అగ్నిమాపక సిబ్బంది భవనం నుండి 37 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

AndhraPravasi News Desk 1 min read
Fire Accident: ఘోర అగ్నిప్రమాదం... 18 మంది మృతి!

Media- ఢిల్లీ రెస్టారెంట్ దుర్ఘటనపై సీఎం రేఖా గుప్తా దిగ్భ్రాంతి…

రంగంలోకి దిగిన డీడీఎంఏ, ఫైర్ రెస్క్యూ బృందాలు!

అగ్నిమాపక నిబంధనలపై పోలీసుల ముమ్మర దర్యాప్తు!

Fire Accident: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు (జూన్ 3, 2026) ఉదయం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ పరిధిలో గల హౌజ్ రాణి ప్రాంతంలోని ఐదు అంతస్తుల భవనంలో నడుస్తున్న ‘లెమన్ గ్రీన్’ రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా దట్టమైన పొగ, మంటలు క్షణాల వ్యవధిలో భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 20 మంది సజీవదహనమవ్వగా, చనిపోయిన వారిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) అధికారులు రంగంలోకి దిగారు. నెహ్రూ ప్లేస్ ఫైర్ స్టేషన్ డివిజనల్ అధికారి రవీందర్ పర్యవేక్షణలో వాటర్ టెండర్లు, క్యూఆర్వీ వాహనాలతో సహా పలు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దట్టమైన పొగతో నిండిపోయిన బేస్‌మెంట్‌లో చిక్కుకున్న ముగ్గురితో పాటు భవనం నుండి మొత్తం 37 మందిని ఫైర్ సిబ్బంది చాకచక్యంగా రక్షించారు. క్షతగాత్రులను క్యాట్స్ (CATS) అంబులెన్స్‌ల ద్వారా తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు.

ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్ర దిగ్భ్రాంతి మరియు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ (PMNRF) నుండి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (DDMA), సివిల్ మరియు పోలీస్ బృందాలు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. కాగా, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అగ్నిమాపక నిబంధనల ఉల్లంఘనలపై నివేదిక సేకరిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Crime News: కన్నవారే కాలయములైతే.. నడివీధిలో యువతిపై తల్లిదండ్రుల దాడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Crime News: కన్నవారే కాలయములైతే.. నడివీధిలో యువతిపై తల్లిదండ్రుల దాడి, సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Crime News: ప్రేమించి పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో కన్న కూతురిపై తల్లిదండ్రులే పైశాచికంగా దాడి చేశారు…